Saturday, November 15, 2025
Homeఇంటర్నేషనల్INDIA AT UN: "మమ్మల్ని విమర్శించే ముందు.. మిమ్మల్ని మీరు చూసుకోండి!"

INDIA AT UN: “మమ్మల్ని విమర్శించే ముందు.. మిమ్మల్ని మీరు చూసుకోండి!”

India slams Pakistan at UN : ప్రపంచ వేదికపై మరోసారి పాకిస్థాన్ బూటకపు ప్రచారాన్ని భారత్ ఎండగట్టింది. ఐక్యరాజ్యసమితి సాధారణ సభ (UNGA) సాక్షిగా, దాయాది దేశం అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిని, ఉగ్రవాద ప్రోత్సాహాన్ని బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. “భారత్‌ను విమర్శించే ముందు, పాకిస్థాన్ ఆత్మావలోకనం చేసుకోవాలి,” అంటూ ఆయన చేసిన ఘాటు వ్యాఖ్యలు, అంతర్జాతీయ సమాజం దృష్టిని ఆకర్షించాయి. అసలు ఐరాసలో ఏం జరిగింది..? పాక్‌పై దూబే చేసిన ఆరోపణలేంటి..?

- Advertisement -

ఐక్యరాజ్యసమితిలో ‘పిల్లలు, సాయుధ సంఘర్షణ’ అనే అజెండాపై జరిగిన చర్చలో, బీజేపీ నాయకుడు నిశికాంత్ దూబే భారత్ తరఫున ప్రసంగించారు. ఈ సందర్భంగా, పాకిస్థాన్ తీరును ఆయన తీవ్రంగా తప్పుబట్టారు.

పాక్‌పై దూబే విమర్శనాస్త్రాలు..
సీమాంతర ఉగ్రవాదం: “పాకిస్థాన్, సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ, భారత్, అఫ్గానిస్థాన్‌లలోని పాఠశాలలు, విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతోంది. ఈ దాడుల్లో ఎంతోమంది చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారు, వికలాంగులుగా మారుతున్నారు,” అని దూబే ఆరోపించారు.

ద్వంద్వ వైఖరి: “ఒకవైపు ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తూ, మరోవైపు అంతర్జాతీయ వేదికలపై పిల్లల హక్కుల గురించి మాట్లాడటం పాకిస్థాన్ ద్వంద్వ వైఖరికి నిదర్శనం. ముందు సొంత దేశంలో మహిళలు, చిన్నారులపై దాడులు ఆపండి,” అని హితవు పలికారు.

పహల్గాం దాడి ప్రస్తావన: 2025 ఏప్రిల్‌లో జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో 26 మంది అమాయక పౌరుల ప్రాణాలను బలిగొన్న ఉగ్రదాడిని అంతర్జాతీయ సమాజం మర్చిపోదని ఆయన గుర్తుచేశారు.

ఆపరేషన్ సిందూర్’.. భారత్ హక్కు : పహల్గాం దాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ గురించి కూడా దూబే ఐరాసలో ప్రస్తావించారు.

పహల్గాం దాడికి ప్రతిస్పందనగా, భారత్ తన ప్రజలను ఉగ్రవాదుల నుంచి రక్షించుకోవడానికి, తన చట్టబద్ధమైన హక్కును ఉపయోగించుకుంది. 2025 మేలో ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టి, పాక్‌లోని తొమ్మిది ఉగ్రస్థావరాలను మట్టికరిపించాం. దీనికి ప్రతీకారంగానే, పాక్ మా సరిహద్దు గ్రామాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసి, పౌరులను, పిల్లలను పొట్టనపెట్టుకుంది.”
– నిశికాంత్ దూబే, బీజేపీ ఎంపీ

ప్రపంచ వేదికలపై భారత్‌పై నిరాధార ఆరోపణలు చేయడం మానుకుని, ఉగ్రవాదాన్ని అరికట్టడంపై దృష్టి పెట్టాలని దూబే పాకిస్థాన్‌కు గట్టిగా సూచించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad