Nobel Prize 2025 Medicine: వైద్య శాస్త్రంలో విశేష కృషి చేసినందుకు గాను ప్రముఖ శాస్త్రవేత్తలు.. మేరీ ఇ. బ్రున్కో, ఫ్రెడ్ రామ్స్డెల్, షిమన్ సకాగుచీకి ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మక నోబెల్ పురస్కారం వరించింది. అత్యంత ప్రతిష్ఠాత్మక నోబెల్ పురస్కారాలను నోబెల్ జ్యూరీ ప్రకటిస్తుంది. ఈ నేపథ్యంలో ముందుగా వైద్య విభాగానికి సంబంధించి నోబెల్ పురస్కారాలను సోమవారం జ్యూరీ ప్రకటించింది.
నోబెల్ పురస్కారాల పండుగ మొదలైంది. వైద్య విభాగంతో మొదలైన నోబెల్ పురస్కారాల ప్రదానం ఈ నెల 13 వరకు కొనసాగనున్నట్లు జ్యూరీ ప్రకరటించింది. పలు రంగాల్లో విశేష కృషి చేసిన వారికి నోబెల్ పురస్కారాలను ప్రదానం చేయనున్నారు. కాగా, రోగ నిరోధక వ్యవస్థను ఎలా అదుపులో ఉంచుతారనే అంశంపై పరిశోధన చేసినందుకు గాను అమెరికాకు చెందిన మేరీ ఇ బ్రంకో, ఫ్రెడ్ రామ్స్డెల్, జపాన్కు చెందిన షిమోన్ సకాగుచిలు వైద్య రంగంలో నోబెల్ బహుమతిని గెలుచుకున్నారని నోబెల్ జ్యూరీ వెల్లడించింది.
BREAKING NEWS
The 2025 #NobelPrize in Physiology or Medicine has been awarded to Mary E. Brunkow, Fred Ramsdell and Shimon Sakaguchi “for their discoveries concerning peripheral immune tolerance.” pic.twitter.com/nhjxJSoZEr— The Nobel Prize (@NobelPrize) October 6, 2025
ఈ శాస్త్రవేత్తల ఆవిష్కరణలు కొత్త పరిశోధనా రంగానికి పునాది వేశాయని.. క్యాన్సర్, ఆటో ఇమ్యూన్ వ్యాధుల వంటి కొత్త చికిత్సల అభివృద్ధికి దోహదపడ్డాయని నోబెల్ జ్యూరీ పేర్కొంది. పరిధీయ రోగనిరోధక సహనానికి(peripheral immune tolerance) సంబంధించి వీరి పరిశోధనలు కొనసాగాయి.
కాగా, నోబెల్ పురస్కారాలను భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, సాహిత్యం, వైద్య శాస్త్రంతో పాటు ఆర్థిక శాస్త్రంలో కృషి చేసిన శాస్త్రవేత్తలకు, ప్రపంచ శాంతికి కృషిచేసిన సామాజికవేత్తలకు ప్రతియేటా ప్రదానం చేస్తుంటారు. ఈ ఐదు పురస్కారాలను వ్యాపారవేత్త, ప్రఖ్యాత స్వీడిష్ శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ 1895 నాటి వీలునామా ప్రకారం 1901లో ప్రారంభించారు. విజేతలను వివిధ సంస్థల నుంచి ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీలు నిర్ణయిస్తాయి.


