Sunday, November 16, 2025
Homeఇంటర్నేషనల్Pakistan Afghanistan Relation : ఆఫ్ఘనిస్తాన్-భారత్ సంబంధాలపై పాకిస్థాన్ ఘాటు స్పందన... చివరికి అనుకున్నదే చేసింది!

Pakistan Afghanistan Relation : ఆఫ్ఘనిస్తాన్-భారత్ సంబంధాలపై పాకిస్థాన్ ఘాటు స్పందన… చివరికి అనుకున్నదే చేసింది!

Pakistan Afghanistan Relation : పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తీవ్రరూపం తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్, ఆఫ్ఘన్‌తో ఉన్న అన్ని రకాల ప్రత్యక్ష, పరోక్ష సంబంధాలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు సంచలన ప్రకటన చేసింది. రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్, వార్తా సంస్థ కార్యక్రమంలో మాట్లాడుతూ, “ప్రస్తుతం మా మధ్య ప్రతిష్ఠంభన నెలకొంది. శత్రుత్వం ముదిరింది. ఇప్పటికి ఆఫ్ఘన్‌తో మాకు ఎలాంటి సంబంధాలు లేవు” అని తేల్చి చెప్పారు. బెదిరింపులు కొనసాగుతుండగా చర్చలు సరైనవి కావని, ఉగ్రవాద ముప్పుపై చర్యలు తీసుకున్న తర్వాతే చర్చలకు అవకాశం ఉంటుందని ఆయన వాదించారు.

- Advertisement -

ALSO READ: Ravi Teja: సినిమాల్లోకి ర‌వితేజ కూతురు ఎంట్రీ – హీరోయిన్‌గా కాదండోయ్‌!

ఈ వివాదం గత వారం మొదలైంది. అక్టోబర్ 9న పాక్ వాయుసేన పాక్ తాలిబాన్ (TTP) శిబిరాలపై కాబుల్, ఖోస్ట్, జలాలబాద్, పాక్టికాలో దాడులు చేసింది. 200 మంది ఆఫ్ఘన్ ఫైటర్లు మరణించారని పాక్ చెప్పగా, తాలిబాన్ 58 పాక్ సైనికులు చంపామని ప్రతిదాడి చేసింది. దీంతో టార్ఖామ్, చమాన్ బార్డర్ క్రాసింగ్‌లు మూసివేశారు. రెండో రోజు కూడా మూసే ఉంటాయని అధికారులు తెలిపారు. పాక్ సైన్యం ఆఫ్ఘన్ భూభాగంలో TTP చీఫ్ నూర్ వలీ మెహసూద్ ఉన్నారని ఆరోపించింది. తమ దాడులు సాధారణ పౌరులపై కాదు, ఉగ్రవాద శిబిరాలపైనే అని ఆసిఫ్ సమర్థించారు.

ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ స్పందించారు. “పాక్ మినహా మిగతా 5 పొరుగు దేశాలతో మా సంబంధాలు మంచివే. మా దేశంలో శాంతి నెలకొంది. ఎవరితోనూ గొడవలు వద్దు” అన్నారు. ఆఫ్ఘన్ “పాక్ దాడులు అన్యాయం” అని, పాక్ “ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తున్నారు” అని ఆరోపణలు చేసింది. ఈ వివాదం ద్వారా ఇరు దేశాల మధ్య వాణిజ్యం, వీజాలు, డిప్లొమటిక్ టైస్ ప్రభావితమయ్యాయి.

పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ “ఆఫ్ఘన్ ఉగ్రవాదానికి మద్దతు ఇస్తోంది” అని ఆరోపించారు. భారత్, చైనా, రష్యా ఈ ఉద్రిక్తతలపై ఆందోళన వ్యక్తం చేశాయి. మధ్యప్రాచ్యంలో శాంతి చర్చలపై ప్రభావం పడవచ్చు. పాక్ “చర్చలకు సిద్ధం, కానీ ఉగ్రవాద చర్యలు తప్పవు” అని, ఆఫ్ఘన్ “పాక్ దాడులు ఆపాలి” అని స్పందిస్తోంది. ఈ వివాదం రెండు దేశాల మధ్య శత్రుత్వాన్ని మరింత పెంచుతోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad