Monday, February 16, 2026
Homeఇంటర్నేషనల్Pakistan Bloodshed: బలూచిస్థాన్‌లో రక్తపాతం.. BLA దాడుల్లో 125 మంది మృతి.!

Pakistan Bloodshed: బలూచిస్థాన్‌లో రక్తపాతం.. BLA దాడుల్లో 125 మంది మృతి.!

BLAAttack : పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో అరాచకం చెలరేగింది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) రెబల్స్ , పాక్ భద్రతా దళాల మధ్య జరిగిన భీకర పోరాటంలో ఇప్పటివరకు సుమారు 125 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడులు బలూచిస్థాన్‌లోని పలు ప్రాంతాలను రక్తసిక్తం చేశాయి, దీనివల్ల అక్కడ యుద్ధ వాతావరణం నెలకొంది.

- Advertisement -
12 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు

బలూచిస్థాన్‌ను పాక్ నుంచి విడదీయాలని పోరాడుతున్న BLA (Baloch Liberation Army) ఉగ్రవాదులు వ్యూహాత్మకంగా ఈ దాడులకు పాల్పడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 12 వేర్వేరు ప్రాంతాల్లో వీరు ఏకకాలంలో విరుచుకుపడ్డారు. రైల్వే పట్టాలను పేల్చివేయడం, రహదారులను దిగ్బంధించడం , భద్రతా దళాల క్యాంపులపై మెరుపు దాడులు చేయడం ద్వారా భారీ నష్టాన్ని కలిగించారు.

మృతుల వివరాలు , భారీ నష్టం

పాక్ అధికారిక వర్గాల సమాచారం ప్రకారం, ఈ హింసాకాండలో భారీగా ప్రాణనష్టం సంభవించింది. దాడులను తిప్పికొట్టే క్రమంలో దాదాపు 18 మంది సెక్యూరిటీ సిబ్బంది మరణించారు. రెబల్స్ జరిపిన కాల్పులు , బాంబు దాడుల్లో 15 మంది అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయారు.

పాక్ ఆర్మీ జరిపిన ఎదురుదాడుల్లో సుమారు 92 మంది BLA మిలిటెంట్లు హతమైనట్లు అధికారులు ప్రకటించారు. అయితే, గాయపడిన వారి సంఖ్య వందల్లో ఉండటంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని భద్రతా వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

అదుపు తప్పిన పరిస్థితులు

ప్రస్తుతానికి బలూచిస్థాన్‌లో పరిస్థితి అత్యంత ఉద్రిక్తంగా ఉంది. అనేక చోట్ల ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి , రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. పాక్ ప్రభుత్వం అదనపు బలగాలను రంగంలోకి దింపినప్పటికీ, రెబల్స్ ఇంకా పలు ప్రాంతాల్లో పట్టు కలిగి ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా చైనా పెట్టుబడులతో నిర్మిస్తున్న ప్రాజెక్టులే లక్ష్యంగా ఈ దాడులు జరుగుతుండటం పాకిస్థాన్‌కు తలనొప్పిగా మారింది.

Telangana Politics: ఇది నివురుగప్పిన నిశ్శబ్ధం

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News