Pakistan Nominates Trump For Nobel Prize: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండో సారి అధ్యక్షపదవి బాధ్యతలు చేపట్టాక దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఇతర దేశాల వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారు. కొన్ని దేశాల ఎగుమతులపై సుంకాలు భారీగా విధిస్తున్నారు. మరోవైపు యుద్ధ బరిలో దిగిన పలు దేశాలకు పద్థతి మార్చుకోవాలంటూ వార్నింగ్ ఇస్తున్నారు. మొత్తానికి ట్రంప్ వ్యవహార శైలి ప్రపంచమంతా హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉంగానే డొనాల్డ్ ట్రంప్ ఓ అడుగు ముందుకేసి తనకు శాంతి నోబెల్ బహుమతి రావాలని ఆకాంక్షించారు.
భారత్-పాకిస్తాన్ మధ్య యుద్ధం ఆపడంతో పాటు కాంగో-రువాండా దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదర్చడంలో తాను కీలక పాత్ర పోషించానని తెలిపారు. అలాగే రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలు, ఇజ్రాయెల్-హమాస్, ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధాలను ఆపేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నానని వివరించారు. తాను జోక్యం చేసుకున్నాను కాబట్టే అణు యుద్ధం తప్పిపోయిందన్నారు. దీంతో తాను నోబెల్ శాంతి బహుమతికి అర్హుడనని తెలిపారు. తనకు నాలుగైదు సార్లు నోబెల్ పురస్కారం రావాల్సి ఉందని.. కానీ తనకు ఇవ్వరంటూ నోబెల్ కమిటీపై విమర్శలు చేశారు.
ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ప్రభుత్వం ఆయనను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేయడం చర్చగా మారింది. భారత్-పాకిస్థాన్ మధ్య తలెత్తిన ఘర్షణల సమయంలో ట్రంప్ దౌత్యపరంగా జోక్యం చేసుకుని కీలకంగా వ్యవహరించారని పేర్కొంది. ట్రంప్ నాయకత్వానికి గుర్తుగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటనలో తెలిపింది. ఈ సందర్భంగా ట్రంప్ను నిజమైన శాంతి నిర్మాతగా అభివర్ణించింది.
కాగా కొన్ని రోజుల ముందే పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ వైట్హౌస్లో ట్రంప్తో సమావేశం కావడం విశేషం. అసిమ్ మునీర్ గతంలోనే ట్రంప్కు నోబెల్ బహుమతి ఇవ్వాలని వాదించారు. ఇరు దేశాల మధ్య అణు యుద్ధం సంభవించకుండా ట్రంప్ నిరోధించారని ప్రశంసించారు. పాకిస్తాన్ ప్రభుత్వ పెద్దలను కాకుండా ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్కు వైట్హౌస్ నుంచి ఆహ్వానం అందడాన్ని పెద్ద దౌత్య విజయంగా పరిగణిస్తున్నారు పాక్ అధికారులు.
Donald Trump: నోబెల్ శాంతి పురస్కారానికి ట్రంప్ను నామినేట్ చేసిన పాకిస్తాన్
సంబంధిత వార్తలు | RELATED ARTICLES