భారతదేశంలో చిన్న పిల్లలు ఇష్టంగా తినే పార్లే-జీ(Parle G)బిస్కెట్లు చౌకగా లభిస్తున్న సంగతి తెలిసిందే. కేవలం రూ.5లకే ఈ బిస్కెట్ ప్యాకెట్ మార్కెట్ లో అందుబాటులో ఉంది. కానీ ఇదే బిస్కెట్ ప్యాకెట్ గాజాలో మాత్రం ఏకంగా రూ.2300కు విక్రయిస్తున్నారు. ధర అంత తేడా ఉండటానికి ఆ దేశంలో నెలకొన్న యుద్ధ పరిస్థితులే కారణం. ఈ బిస్కెట్ ప్యాకెట్ ధర గురించి ఓ వ్యక్తి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఇజ్రాయెల్-హమాస్ మధ్య గత 2 ఏళ్లుగా భీకర యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇజ్రాయెల్ బలగాల దాడులకు గాజాలోని ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. ప్రాణభయంతో లక్షల మంది పాలస్తీనియన్లు గాజాను విడిచిపెట్టి ఇతర దేశాలకు పారిపోయారు. అయితే యుద్ధం కారణంగా గాజాలో పరిస్థితులు దారుణంగా మారిపోయాయి. సరైన తిండి లేక ఆకలితో అలమటించి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు.
యుద్ధం కారణంగా కొన్ని నెలలుగా గాజా సరిహద్దులను మూసివేశారు. దీంతో నిత్యావసర వస్తువులు అందక అక్కడ తీవ్ర కరవు పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో చిన్న పిల్లలకు బిస్కెట్లు కూడా కొనలేని పరిస్థితికి వెళ్లిపోయామని ఓ వ్యక్తి ఆవేదన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు అక్కడి దారుణ పరిస్థితులను తెలియజేస్తుంది.
“చాలా కాలం నిరీక్షణ తర్వాత, నా కుమారుడు రఫీఫ్కు ఇష్టమైన పార్లే జీ బిస్కెట్లను ఈరోజు నేను సంపాదించగలిగాను. వాటి ధర 1.5 యూరోల(రూ146) నుండి 24 యూరోలకు(రూ.2,342) పైగా పెరిగినప్పటికీ, రఫీఫ్కు ఇష్టమైన ఈ చిరుతిండిని కాదనలేకపోయాను” అని పోస్టులో పేర్కొన్నారు. కాగా కిలో చక్కెర రూ. 4,914, లీటర్ వంట నూనె రూ. 4,177, కిలో బంగాళాదుంపలు రూ. 1,965, కిలో ఉల్లిపాయలు రూ. 4,423, కప్పు కాఫీ రూ. 1,800గా ఉన్నాయి. దీంతో అక్కడి ప్రజలు అంత ధరలు పెట్టి కొనలేక అల్లాడిపోతున్నారు.
Parle G: వామ్మో పార్లే-జీ బిస్కెట్ ధర రూ.2300.. ఎక్కడో తెలుసా..?
సంబంధిత వార్తలు | RELATED ARTICLES