Saturday, November 15, 2025
Homeఇంటర్నేషనల్Asim Munir: అమెరికా గడ్డపై భారత్‌కు పాక్ ఆర్మీ చీఫ్ అణు బెదిరింపులు

Asim Munir: అమెరికా గడ్డపై భారత్‌కు పాక్ ఆర్మీ చీఫ్ అణు బెదిరింపులు

Pakistan Army Chief Asim Munir’s Nuclear Threat: పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ అమెరికా పర్యటనలో సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్‌తో యుద్ధం సంభవిస్తే “అణు యుద్ధం” తప్పదని, దానివల్ల “సగం ప్రపంచం” నాశనమవుతుందని బహిరంగంగా హెచ్చరించారు. ఫ్లోరిడాలోని టాంపాలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి.

- Advertisement -

“మేము అణ్వస్త్ర దేశం. మా దేశం నాశనమవుతోందని భావిస్తే, సగం ప్రపంచాన్ని మాతో పాటు తీసుకెళ్తాం,” అని మునీర్ అన్నట్లు సమాచారం. ఒక దేశం నుంచి మరొక దేశంపై అణు బెదిరింపులు చేయడం బహుశా అమెరికా గడ్డపై ఇదే తొలిసారి.

సింధు నదీ జలాలపై హెచ్చరికలు

సింధు నదీ జలాల ఒప్పందంపై కూడా మునీర్ ఘాటుగా స్పందించారు. నదీ జలాల ప్రవాహాన్ని అడ్డుకునేలా భారత్ ఏ నిర్మాణం చేపట్టినా, దాన్ని పది మిస్సైళ్లతో ధ్వంసం చేస్తామని మునీర్ హెచ్చరించారు. “మాకు మిస్సైళ్ల కొరత లేదు, అల్హందులిల్లా” అని ఆయన పేర్కొన్నారు.

ఏప్రిల్‌లో పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ ఈ ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేసిందని, దీనివల్ల 250 మిలియన్ల మంది ప్రజలు ఆకలితో అలమటించే ప్రమాదం ఉందని ఆయన ఆరోపించారు.

సైనిక జోక్యంపై వ్యాఖ్యలు

పాకిస్తాన్ రాజకీయాల్లో సైన్యం పాత్రపై మునీర్ మాట్లాడుతూ, “యుద్ధం అనేది కేవలం సైనికులకు వదిలేయడానికి చాలా తీవ్రమైన అంశం అని అంటారు, కానీ రాజకీయాలు కూడా కేవలం రాజకీయ నాయకులకు వదిలేయడం చాలా తీవ్రమైన అంశం” అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు పాకిస్తాన్ రాజకీయాల్లో సైన్యం జోక్యం కొనసాగుతుందని చెప్పకనే చెప్పాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad