Saturday, November 15, 2025
Homeలైఫ్ స్టైల్Kitchen Tips:వంటింట్లో ఈ మూడు వస్తువులు ఉన్నాయా..అయితే వెంటనే తీసేయండి!

Kitchen Tips:వంటింట్లో ఈ మూడు వస్తువులు ఉన్నాయా..అయితే వెంటనే తీసేయండి!

Kitchen Health:ఇంట్లో వంట చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ రకరకాల పాత్రలు, ప్యాన్స్, బోర్డులు వాడుతారు. కానీ ఈ వాడకం వెనుక దాగి ఉన్న కొన్ని ప్రమాదాలను చాలా మంది గ్రహించరు. వంటింట్లో ఉపయోగించే మూడు సాధారణ వస్తువులు ఆరోగ్యానికి తీవ్ర ముప్పు కలిగిస్తున్నాయని వైద్య నిపుణులు వివరించారు. ఆయన మాటల్లో చెప్పాలంటే, ఇవి వాడడం వల్ల రసాయనాలు ఆహారంలో కలసి శరీరానికి హాని చేస్తాయి. ముఖ్యంగా సంతాన సమస్యలు, హార్మోన్ లోపాలు, బీపీ, డయాబెటిస్, కొలెస్ట్రాల్ సమస్యలు, కేన్సర్ వంటి వ్యాధులకు ఇవి దారి తీస్తున్నాయని చెబుతున్నారు.

- Advertisement -

అత్యంత హానికరమని…

ఉదయం నుంచి రాత్రి వరకు వంటగది అనేది ఎక్కువగా ఉపయోగించే ప్రదేశం. తొందరపాటులో మనం ఏ పాత్రలో వండుతున్నాం, ఏ బోర్డుతో కూరలు కట్ చేస్తున్నాం, ఏ ప్యాన్ లో వేపుళ్లు చేస్తున్నాం అనేదానిపై ఎక్కువగా దృష్టి పెట్టం. కానీ వీటినే పట్టించుకోకపోవడం వల్ల అనారోగ్యాలు వస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా కిచెన్ లో వాడే మూడు వస్తువులు అత్యంత హానికరమని నిపుణులు వివరిస్తున్నారు.

Also Read: https://teluguprabha.net/health-fitness/pink-salt-vs-table-salt-which-is-better-for-health/

మొదటిగా ప్లాస్టిక్ పాత్రల సమస్యను ఆయన గుర్తించారు. ప్లాస్టిక్ పాత్రలు కొత్తగా ఉన్నప్పుడు పెద్దగా సమస్య ఉండకపోయినా, వాటిని వేడి చేసిన ప్రతిసారి హానికరమైన బిస్ఫినాల్-A (BPA) అనే రసాయనం విడుదలవుతుంది. వేడి ఆహారాన్ని అందులో వేసినప్పుడు లేదా మళ్లీ మళ్లీ వేడి చేయడం వల్ల ఈ రసాయనం ఆహారంలో కలసిపోతుంది. దీని వల్ల రక్తపోటు పెరగడం, డయాబెటిస్ రావడం, అధిక బరువు సమస్యలు తలెత్తడం మాత్రమే కాకుండా, కేన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉందని ఆయన వివరించారు. అందువల్ల ప్లాస్టిక్ పాత్రలకు బదులుగా స్టీల్ లేదా గాజు పాత్రలు వాడితేనే సురక్షితం అని సూచించారు.

ప్లాస్టిక్ కటింగ్ బోర్డులు..

రెండో సమస్య ప్లాస్టిక్ కటింగ్ బోర్డులు. వంటింట్లో కూరగాయలు, మాంసం తరచుగా ప్లాస్టిక్ బోర్డుపై కోస్తారు. ఇవి ఎక్కువ రోజులు వాడితే అరిగిపోతూ చిన్న చిన్న ప్లాస్టిక్ కణాలు విడుదలవుతాయి. ఆ కణాలు ఆహారంలో కలసి శరీరంలో పేరుకుపోతాయి. ఈ మైక్రోప్లాస్టిక్స్ శరీరంలో చేరినప్పుడు జీర్ణవ్యవస్థ సమస్యలు, ఇన్‌ఫ్లమేషన్, హార్మోన్ అసమతుల్యతలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల చెక్కతో తయారు చేసిన బోర్డులు లేదా గాజు బోర్డులు వాడితే మంచిదని ఆరోగ్య నిపుణులు సలహా ఇచ్చారు.

నాన్ స్టిక్ ప్యాన్స్..

మూడో ప్రధాన సమస్య నాన్ స్టిక్ ప్యాన్స్. ఇవి వాడకానికి సులభం, తక్కువ నూనెతో వంట చేయొచ్చు కాబట్టి చాలా ఇళ్లలో తప్పనిసరిగా ఉంటాయి. కానీ ఈ ప్యాన్స్ పై పొర దెబ్బతిన్నప్పుడు లేదా ఎక్కువ సేపు వేడి చేసినప్పుడు హానికర రసాయనాలు విడుదలవుతాయి. ఈ రసాయనాలు ఆహారంతో కలిసి శరీరంలోకి వెళ్తాయి. దీని ప్రభావం నరాలపై పడటమే కాకుండా బీపీ, కొలెస్ట్రాల్ పెరగడం, సంతాన సమస్యలు రావడం వంటి సమస్యలు తలెత్తుతాయని ఆయన వివరించారు. అందుకే వీటికి బదులుగా స్టెయిన్‌లెస్ స్టీల్, కాస్ట్ ఐరన్ లేదా పింగాణి పాత్రలు వాడాలని సూచించారు.

Also Read: https://teluguprabha.net/health-fitness/ashwagandha-benefits-and-side-effects-explained-clearly/

ఈ మూడు వస్తువులను నిర్లక్ష్యం చేస్తే దీర్ఘకాలంలో తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయని డాక్టర్ హెచ్చరిస్తున్నారు. ప్లాస్టిక్ పాత్రల్లో వేడి పదార్థాలు ఉంచకపోవడం, ప్లాస్టిక్ కటింగ్ బోర్డులను వాడకపోవడం, నాన్ స్టిక్ ప్యాన్స్ స్థానంలో ఇతర ప్రత్యామ్నాయాలను ఎంచుకోవడం ద్వారా అనారోగ్య ముప్పును తగ్గించవచ్చని చెప్పారు.

ముఖ్యంగా వంటగది శుభ్రత కూడా చాలా అవసరం. పాత్రలు, ప్యాన్స్, బోర్డులు సరైన విధంగా శుభ్రం చేయకపోతే బ్యాక్టీరియా, క్రిములు పెరిగే ప్రమాదం ఉంది. ఇవి కూడా ఆహారంలోకి చేరి జీర్ణవ్యవస్థ సమస్యలు తలెత్తిస్తాయి. కాబట్టి వంటగది పరిశుభ్రత, సురక్షిత పాత్రల వాడకం అనేవి కుటుంబం ఆరోగ్యానికి తప్పనిసరి అని నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad