Saturday, November 15, 2025
Homeనేషనల్Building Collapse: నాలుగు అంతస్తుల భవనం కూలి 17 మంది మృతి

Building Collapse: నాలుగు అంతస్తుల భవనం కూలి 17 మంది మృతి

17 Dead in Building Collapse: మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. విరార్ ఈస్ట్ ప్రాంతంలో ఓ నాలుగు అంతస్తుల భవనం కూలిపోవడంతో కనీసం 17 మంది మరణించారు. ఈ ఘటన బుధవారం తెల్లవారుజామున 12:05 గంటలకు జరిగింది. రామబాయి అపార్ట్‌మెంట్స్ అనే నాలుగు అంతస్తుల భవనం వెనుక భాగం కూలిపోయి, కింద ఉన్న చాల్‌పై పడింది.

- Advertisement -

ఘటన జరిగిన వెంటనే సహాయక చర్యలు ప్రారంభమయ్యాయి. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డీఆర్‌ఎఫ్) కు చెందిన రెండు బృందాలు, అగ్నిమాపక దళం, స్థానిక పోలీసులు సహాయక చర్యల్లో పాలుపంచుకుంటున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికి తీసేందుకు గడిచిన 36 గంటలకు పైగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇప్పటివరకు తొమ్మిది మందిని రక్షించగా, వారిలో ఇద్దరు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఈ దుర్ఘటనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తామని ఆయన ప్రకటించారు. ముఖ్యమంత్రి కార్యాలయం ఎక్స్ (గతంలో ట్విట్టర్) వేదికగా ఈ విషయాన్ని తెలియజేసింది.

ఈ భవనం కూలిపోవడానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. భవనం కూలిపోవడానికి కారణమైన 50 ఏళ్ల బిల్డర్ నిలే సానేని పోలీసులు అరెస్టు చేశారు. అతడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. మహారాష్ట్ర ప్రాంతీయ పట్టణ ప్రణాళిక చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించినందుకు సెక్షన్లు 52, 53, 54 కింద, అలాగే భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్)లోని సెక్షన్ 105 కింద, హత్యా ప్రయత్నం కింద కేసులు నమోదు చేసినట్లు వాసై విరార్ పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad