ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళా(Maha Kumbh Mela)లో మరోసారి అగ్ని ప్రమాదం జరిగింది. శంకరాచార్య మార్గ్లోని సెక్టార్-18లో మంటలు వ్యాపించండండో అక్కడే ఉన్న అనేక గూడారాలు బూడిదయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. మంటలు వేగంగా వ్యాపిస్తుండటంతో సమీపంలోని ఇతర గుడారాలలో నివసించే ప్రజలు బయటకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అగ్నిప్రమాదానికి కారణమేమిటో ఇంకా తెలియరాలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.