Monday, February 3, 2025
Homeనేషనల్Ayodhya: అయోధ్య రామాలయ ప్రధాన పూజారికి బ్రెయిన్ స్ట్రోక్.. ఆరోగ్య పరిస్థితి విషమం..!

Ayodhya: అయోధ్య రామాలయ ప్రధాన పూజారికి బ్రెయిన్ స్ట్రోక్.. ఆరోగ్య పరిస్థితి విషమం..!

అయోధ్య రామాలయ ప్రధాన పూజారి.. మహంత్ సత్యేంద్ర దాస్‌ ఆరోగ్య పరిస్థితి విషమించింది. ఆయనకు బ్రెయిన్‌ స్ట్రోక్‌ రావడంతో ఆసుపత్రికి తరలించారు. మహంత్ సత్యేంద్ర దాస్‌ను లక్నోలోని సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హాస్పిటల్‌లో చేర్చినట్లు తెలుస్తోంది. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం అందుతోంది. మహంత్ సత్యేంద్ర దాస్‌ బీపీ, షుగర్ బాధపడుతున్నారు. ఈ క్రమంలో బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో ఆరోగ్య పరిస్థితి విషమించినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

- Advertisement -

మహంత్ సత్యేంద్ర దాస్ పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ.. వైద్యానికి స్పందిస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. గత కొంత కాలంగా శ్రీ సత్యేంద్ర దాస్ డయాబెటిక్, హైపర్‌టెన్సివ్‌తో బాధపడుతున్నారు. ప్రస్తుతం న్యూరాలజీ వార్డు హైడిపెండెన్సీ యూనిట్ (HDU)లో ఆయనను ఉంచి చికిత్స చేస్తున్నట్లు ఆసుపత్రి వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి.

1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీద్ ఘటన సమయంలో తాత్కాలిక రామ మందిరానికి పూజారిగా ఉన్నారు సత్యేంద్ర దాస్‌. 20 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నిర్వాణి అఖాడాలో చేరారు. ఆధ్యాత్మిక దీక్ష తీసుకున్నారు. ఇక అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం, బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠలో కీలక భూమిక పోషించారు. ప్రస్తుతం రామాలయ ప్రధాన పూజారిగా ఉన్నారు. మహంత్ సత్యేంద్ర దాస్ ఆరోగ్య పరిస్థితి పట్ల భక్తులు ఆందోళన చెందుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News