Tuesday, July 2, 2024
Homeనేషనల్Bangalore: మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై సదస్సు

Bangalore: మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై సదస్సు

జాతీయ భద్రత మరియు మాదక ద్రవ్యాల అక్రమ రవాణా పై బెంగుళూరు వేదికగా ప్రాంతీయ సదస్సులో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం జగన్ హాజరు కాకపోవటంతో ఏపీ సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సదస్సులో పాల్గొన్నారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నందున ఈ సదస్సుకు హాజరుకాలేకపోయినట్టు..అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించాల్సిన నేపధ్యంలో ఈ సమావేశానికి హాజరుకాలేకపోయినందునే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరైనట్టు సీఎం జగన్ వివరించారు. ఏపీ ప్రభుత్వం తరపున డీజీపీ ఈ సదస్సుకు హాజరయ్యారని, సదస్సులో తీసుకున్న నిర్ణయాలపై ప్రభుత్వపరంగా తగిన చర్యలు తీసుకుంటామని జగన్‌ తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News