Sunday, November 16, 2025
Homeనేషనల్Bharat Jodo Yatra: డ్యాన్స్ చేసిన రాహుల్, ఫుల్ జోష్ లో కాంగ్రెస్ నేతలు

Bharat Jodo Yatra: డ్యాన్స్ చేసిన రాహుల్, ఫుల్ జోష్ లో కాంగ్రెస్ నేతలు

భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ మానియా బాగానే హిట్ అవుతోంది. సెలబ్రిటీలు, కామన్ మ్యాన్ లు పెద్ద ఎత్తున భారత్ జోడో యాత్రలో రాహుల్ తో కలిసి నడుస్తున్నారు. ఇక సెల్ఫీల సందడి నిత్యం కొనసాగుతోంది. మరోవైపు బుల్లెట్ రైడ్ చేయటం, పరిగెత్తటం, లోకల్ ఫుడ్ తినటం వంటివి చేస్తూ రాహుల్ అందరినీ ఆకట్టుకుంటున్నారు. తెలంగాణలో ఫోక్ డ్యాన్సులు చేసిన రాహుల్ ఇప్పుడు ఉజ్జయినిలోనూ స్టెప్స్ వేసి అదరగొట్టారు. రాహుల్ కు తోడు మాజీ సీఎంలైన కమల్ నాథ్, దిగ్విజయ్ సింగ్ ఇంకా పలువురు కాంగ్రెస్ నేతలు స్కూల్ పిల్లలతో కలిసి చిందులేశారు. రాహుల్ పాదయాత్ర 83వ రోజకు చేరగా ప్రస్తుతం మధ్యప్రదేశ్ లో ఉత్సాహంగా ఈ యాత్ర సాగుతోంది. ఝార్ఖండ్ ముక్తి మోర్చా, గోవా ఫార్వర్డ్ పార్టీ నేతలు కూడా ఈ యాత్రలో పాలుపంచుకుంటున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad