ALSO READ : Bihar Voter List: బీహార్లో ఓట్ల భూకంపం.. జాబితాలో అఫ్గాన్.. బంగ్లా వాసుల కలకలం!
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బీజేపీ తీవ్రంగా స్పందించింది. పట్నాలోని కొత్వాలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదు చేసిన బీజేపీ, రాహుల్ గాంధీ, తేజస్వీ యాదవ్ల నుంచి క్షమాపణ డిమాండ్ చేసింది. బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ ఈ వ్యాఖ్యలను “అవమానకరం, భారత సంస్కృతికి విరుద్ధం” అని విమర్శించారు. బిహార్ ముఖ్యమంత్రి నీతీష్ కుమార్ కూడా ఈ చర్యను అసభ్యకరమని ఖండించారు.
ALSO READ : Vijay Thalapathy: పరువు హత్యలపై ‘దళపతి’ పోరాటం.. సుప్రీంకోర్టుకెక్కిన విజయ్ పార్టీ!
కాంగ్రెస్ నేత మొహమ్మద్ నౌషాద్, ఈ ఘటన అనుకోకుండా జరిగిందని, తప్పు జరిగితే క్షమాపణలు చెబుతున్నానని తెలిపారు. అయితే, కాంగ్రెస్ అధికారికంగా ఇంకా స్పందించలేదు. సిమ్రీ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదై, విచారణ కొనసాగుతోంది. ఈ ఘటన రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాజకీయ ఉద్రిక్తతలను మరింత పెంచింది


