Monday, March 31, 2025
Homeనేషనల్Rahul Gandhi: బీజేపీ ఎంపీ తలకు గాయం.. రాహుల్ గాంధీ ఏమన్నారంటే..?

Rahul Gandhi: బీజేపీ ఎంపీ తలకు గాయం.. రాహుల్ గాంధీ ఏమన్నారంటే..?

రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah) చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో నిరసన చేపట్టారు. మరోవైపు బీజేపీ ఎంపీలు కూడా పోటీగా నిరసనకు దిగారు. ఈ నేపథ్యంలో బీజేపీ-కాంగ్రెస్ ఎంపీల మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో ఒడిశాకు చెందిన బీజేపీ ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగి తలకు గాయం అయింది. దీంతో వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. అయితే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) తోయడంతోనే తన తలకు గాయం అయిందని ఆయన ఆరోపించారు.

- Advertisement -

కాగా ఈ ఘటనపై రాహుల్ గాంధీ స్పందించారు. పార్లమెంట్ ఆవరణలో చాలా కెమెరాలు ఉన్నాయని.. తాను పార్లమెంటు ప్రవేశద్వారం ద్వారా లోపలికి వెళ్లడానికి ప్రయత్నించానని.. కానీ బీజేపీ ఎంపీలు తనను అడ్డుకునేందుకు ప్రయత్నించారని తెలిపారు. ఈ క్రమంలో వారిని తోసుకుంటు లోపలికి వెళ్లే ప్రయత్నంలో ఓ ఎంపీని తీసేయడంతో అలా జరిగి ఉండవచ్చని తెలిపారు. మొత్తానికి అంబేద్కర్ అంశంపై పోటాపోటీ నిరసనలతో పార్లమెంట్ ఆవరణలో గందరగోళం నెలకొంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News