Sunday, October 6, 2024
Homeనేషనల్BRS Madhyapradesh: కొనసాగుతున్న చేరికలు

BRS Madhyapradesh: కొనసాగుతున్న చేరికలు

భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) పార్టీ పట్ల ఆదరణ, బిఆర్ఎస్ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పట్ల విశ్వాసం, దిన దిన ప్రవర్థమానమవుతూ దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. ఢిల్లీ లో పార్టీ జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించుకున్న నేపథ్యంలో బిఆర్ఎస్ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ఊపందుకున్నాయి. ముఖ్యంగా.. మహారాష్ట్ర కు చెందిన అన్ని వర్గాల ప్రజలు, మేధావులు , పలు పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు బిఆర్ఎస్ పార్టీ పట్ల, ఆపార్టీ ప్రభుత్వం తెలంగాణలో అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పట్ల ఆకర్షితులౌతున్నారు. తెలంగాణ మోడల్ పాలన మాకూ కావాలనే బలమైన ఆకాంక్షతో పార్టీ అధినేత సిఎం కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరుతున్నారు. నిర్విరామంగా సాగుతున్న చేరికల పరంపరలో.. మరో ముఖ్యగట్టం చోటుచేసుకున్నది. ఇప్పటికే పలు రాష్ట్రాల నుంచి చేరికలు జరుగుతున్న నేపథ్యంలో… మధ్యప్రదేశ్ రాష్ట్రం నుంచీ బిఆర్ఎస్ లోకి చేరికలు ప్రారంభమయ్యాయి. మధ్య ప్రదేశ్ కు చెందిన మాజీ ఎంపీ సహా మాజీ ఎమ్మేల్యేలు పలువురు ప్రజా ప్రతినిధులు ప్రజల్లో పట్టువున్న ముఖ్యనేతలు నేడు బిఆర్ఎస్ పార్టీలో చేరడం ప్రాధాన్యత సంతరించుకుంది. మధ్యప్రదేశ్ రాష్ట్రం రేవా పార్లమెంటరీ నియోజవర్గం బిజెపి పార్టీ కి చెందిన మాజీ ఎంపీ బుద్దసేన్ పటేల్ కేసీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి అధినేత గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వీరితో పాటు బిఎస్పీ పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే డా. నరేశ్ సింగ్ గుర్జార్, ఎస్పీ పార్టీ కి చెందిన సాత్నా మాజీ ఎమ్మెల్యే ధీరేంద్ర సింగ్, సాత్నా మాజీ జిల్లా పంచాయత్ సభ్యులు విమల బాగ్రి, సర్వజన్ కళ్యాణ్ పార్టీ జాతీయ అధ్యక్షుడు సంజయ్ యాదవ్, భోపాల్ కు చెందిన రాకేశ్ మాల్వీయ, సత్యేంద్ర సింగ్ తదితరులు బిఆర్ఎస్ పార్టీలో చేరారు.
కాగా….పార్టీలో చేరిన మాజీ ఎంపీ బుద్ధసేన్ పటేల్ ను మధ్యప్రదేశ్ రాష్ట్ర బిఆర్ఎస్ పార్టీ కో ఆర్డినేటర్ గా జాతీయ అధ్యక్షులు సిఎం కేసీఆర్ నియమించారు. కాగా తాము మధ్యప్రదేశ్ కు తిరిగివెళ్లిన తర్వాత ఇప్పటికే ఆసక్తితో ఎదురుచూస్తున్న అక్కడి ప్రజలు నేతలతో సమావేశమై విస్తృతంగా చర్చించనున్నట్టు పార్టీలో చేరిన నేతలు తెలిపారు. తెలంగాణ మోడల్ పాలనకోసం మధ్యప్రదేశ్ ప్రజలు పెద్ద ఎత్తున బిఆర్ఎస్ పార్టీ సభ్యత్వం తీసుకోవడానికి సిద్దంగా వున్నట్టు వారు తెలిపారు. త్వరలోనే తిరిగి హైద్రబాద్ కు వచ్చి భారీ సంఖ్యలో బిఆర్ఎస్ లో చేరుతామని తెలిపారు. కాగా….అనంతరం భూపాల్ లో బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని సభకు అధినేత కేసీఆర్ ను రావాల్సిందిగా వారు ఆహ్వానించారు. ఈ సందర్భంగా చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News