Wednesday, July 3, 2024
Homeనేషనల్BRS Maharashtra: భీవండి నుండి బీఆర్ఎస్ లోకి చేరికలు

BRS Maharashtra: భీవండి నుండి బీఆర్ఎస్ లోకి చేరికలు

మహారాష్ట్ర బీఆర్ఎస్ లో దూకుడు

బీఆర్ఎస్ పార్టీలో మహారాష్ట నుంచి చేరికలు కొనసాగుతూనే ఉన్నాయి. భీవండి నుంచి కాంగ్రెస్, ఎన్సీపీ పార్టీలకు చెందిన పలువురు నాయకులు అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ సమక్షంలో ఆదివారం నాడు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరికి అధినేత గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

- Advertisement -

ఈ సందర్భంగా పార్టీ లో చేరిన వారిలో…
ఎన్సీపీ మైనార్టీ సెల్ జాతీయ కార్యదర్శి అరిఫ్ అజ్మీ, ఫజిల్ అన్సారీ, భీవండి కాంగ్రెస్ నేత, సామాజిక కార్యకర్త ఇర్ఫాన్ మోమిన్, కాంగ్రెస్ నేత, ఎన్జీవో సీనియర్ నాయకుడు అర్ఫత్ షేక్, ఎన్సీపీ థానే జిల్లా ఉపాధ్యక్షుడు మక్సూద్ ఖాన్ తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎ.జీవన్ రెడ్డి, మహారాష్ట బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News