సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్(Praveen Sood) పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం మరో ఏడాది పాటు పొడిగించింది. కొత్త డైరెక్టర్ ఎంపికపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఆయన సర్వీసును పొడిగించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయానికి అప్పాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ కేబినెట్ ఆమోదం తెలిపింది. కాగా ఇటీవల సీబీఐ నూతన డైరెక్టర్ ఎంపిక కోసం ప్రధాని మోదీ, లోక్ సభ పక్ష నేత రాహుల్ గాంధీ భేటీ అయ్యారు. అయితే ఏకాభిప్రాయకం కుదరకపోవడంతో పాటు భారత్-పాక్ ఉద్రిక్తత నేపథ్యంలో ఆయన సర్వీసును మరో ఏడాది పొడిగించినట్లు తెలుస్తోంది.
1986 బ్యాచ్కు చెందిన ఐపీఎస్ అధికారి ప్రవీణ్ సూద్, 1989లో మైసూరు జిల్లా అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా తన సేవల్ని ప్రారంభించారు. అనంతరం బళ్లారి, రాయచూర్ జిల్లాల్లో ఎస్పీగా, బెంగళూరులో డీసీపీగా బాధ్యతలు నిర్వహించారు. పోలీసు విభాగంలో తనదైన ముద్ర వేసిన ఆయనను గతేడాది సీబీఐ డైరెక్టర్గా కేంద్రం నియమించింది. ఈనెల 24వ తేదీలో ఆయన పదవీకాలం ముగియాల్సి ఉంది.