అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదంపై(Fligh Crash)రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతితో పాటు విచారం వ్యక్తం చేశారు. ‘బ్రిటీష్ జాతీయులతో లండన్ వెళ్తున్ ఎయిర్ ఇండియా విమానం భారతదేశంలోని అహ్మదాబాద్ నగరంలో కూలిపోయింది. ఆ దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయి. పరిస్థితిపై భారత్ను సంప్రదించి వివరాలు తెలుసుకుంటున్నాం. ప్రమాదంలో చిక్కుకున్న వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’ అని పేర్కొన్నారు.
“అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదం గురించి తెలిసి తీవ్రంగా కలత చెందాను. ఇది హృదయ విదారకర ఘటన. ఈ ఘటనపై మాటలు రావట్లేదు. ఈ క్లిష్ట సమయంలో దేశం మొత్తం బాధితులకు తోడుగా నిలుస్తుంది” అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తెలిపారు.
‘ఈ ప్రమాదం మాటల్లో చెప్పలేని హృదయ విదారకర ఘటన. ఈ విపత్కర పరిస్థితుల్లో బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నానని.. బాధితులకు సహాయం చేస్తున్న మంత్రులు, అధికారులతో నిరంతరం మాట్లాడుతున్నట్లు” ప్రధాని మోదీ తెలిపారు.
విమాన ప్రమాదంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. “ఈ ప్రమాదం హృదయవిదారకమైనది. ప్రయాణికులు, విమాన సిబ్బంది కుటుంబాలు అనుభవిస్తున్న బాధ, ఆందోళన ఊహకు అందనివి. ఈ అత్యంత క్లిష్ట సమయంలో వారందరికీ నా ఆలోచనలు తోడుగా ఉంటాయి. ఈ క్లిష్ట సమయంలో కాంగ్రెస్ కార్యకర్తలు కూడా క్షేత్రస్థాయిలో ఉండి, బాధితులకు తమకు సాధ్యమైనంత సహాయం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ ప్రమాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ తనను ఘటన కలిచి వేసిందని పేర్కొన్నారు. ప్రమాద సమయంలో విమానంలో ఉన్న వారంతా ప్రాణాలతో సురక్షితంగా తిరిగి రావాలని ప్రార్థనలు చేయాలని కోరారు. బాధితులను, వారి కుటుంబాలను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టాలని కోరారు.
ఈ ప్రమాదం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని ఏపీ సీఎం చంద్రబాబు ఎమోషనల్ అయ్యారు. ప్రయాణికులు, సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు కోసం ప్రార్థిస్తున్నట్లు ట్వీట్ చేశారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ఎమోషనల్ అయ్యారు. ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా బయటపడాలని ప్రార్థిస్తున్నట్లు వెల్లడించారు.