కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం ఉగాది కానుకగా శుభవార్త చెప్పింది. డీఏ 2 శాతం మేర పెంచుతూ(DA Hike) కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీంతో డీఏ మొత్తం బేసిక్ శాలరీలో 53 శాతం నుంచి 55 శాతానికి పెరగనుంది. ఈ నేపథ్యంలో ఉద్యోగుల వేతనం కూడా పెరగనుంది. కేంద్రం నిర్ణయంతో లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ప్రయోజనం చేకూరనుంది. కాగా చివరగా గతేడాది జులైలో డీఏను 50 శాతం నుంచి 53 శాతానికి పెంచారు. ప్రతి ఏడాది రెండుసార్లు డీఏను కేంద్రం సవరిస్తూ ఉంటుంది.