Sunday, September 15, 2024
Homeనేషనల్delhi: రైతుల‌కు ఒలింపియన్ వినేష్ ఫోగట్ మ‌ద్ద‌తు

delhi: రైతుల‌కు ఒలింపియన్ వినేష్ ఫోగట్ మ‌ద్ద‌తు

న్యూఢిల్లీ: దేశ రాజ‌ధాని ఢిల్లీ స‌రిహ‌ద్దుల్లో రైతులు చేప‌డుతున్న‌ ఆందోళన శనివారానికి 200 రోజులు పూర్తి చేసుకుంది. ఈ మైలురాయిని పురస్కరించుకుని ఢిల్లీలోని శంభు సరిహద్దు వద్దకు రైతులు పెద్ద ఎత్తున త‌ర‌లివ‌చ్చారు. రైతులకు మద్దతుగా ఒలింపియన్ వినేష్ ఫోగట్ శంభు ఈ ప్రాంతానికి వ‌చ్చారు. ఖనౌరీ, శంభు, రతన్‌పురా సరిహద్దుల్లో నిరసనలు చేపట్టాలని రైతు భావిస్తున్నార‌ని స‌మాచారం. ఇతర ప్రధాన సమస్యలతో పాటు, నిరసనకారులు అన్ని పంటలకు కనీస మద్దతు ధర క‌ల్పించాల‌ని డిమాండ్ చేస్తున్నారు. రైతు ఉద్యమానికి మద్దతుగా నిలిచిన ప్రముఖ క్రీడాకారిణి ఫోగట్‌ను రైతులు స‌త్క‌రించారు.

- Advertisement -

రైతు నాయకుడు సర్వన్‌సింగ్‌ పంధేర్‌ మాట్లాడుతూ శాంతియుతంగా నిరసనలు సాగుతున్నాయన్నారు. కేంద్రం తమ సహ‌నాన్ని పరీక్షిస్తోందని, ఇంకా తమ డిమాండ్లు నెరవేర్చ‌లేద‌ని ఆయన పేర్కొన్నారు. తాము మరోసారి ప్రభుత్వం ముందు త‌మ‌ డిమాండ్లను ఉంచుతామ‌ని రైతు సంఘం నేత‌లు పేర్కొన్నారు. నిరసన దీక్ష 200 రోజులు పూర్తి చేసుకోవడం ఒక ముఖ్యమైన మైలురాయి అని ఆయన అన్నారు. మ‌రోవైపు బాలీవుడ్ నటి, ఎంపీ కంగనా రనౌత్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేశారు. రనౌత్ గతంలో రైతుల మ‌ధ్య‌ నిరసనలను రేకెత్తించినందుకు భారతీయ జనతా పార్టీ ఆమెపై కఠిన వైఖరిని ప్ర‌ద‌ర్శించాల‌ని ఆయ‌న‌ కోరారు. రాబోయే హర్యానా ఎన్నికలకు రైతులు తమ వ్యూహాన్ని రూపొందించార‌న్నారు. రాష్ట్ర రాజకీయ రంగంలో చురుకైన పాత్ర పోషించాలనే ఉద్దేశంతో రానున్న రోజుల్లో తాము మ‌రింత చురుకుగా మారుతామ‌న్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News