Thursday, July 4, 2024
Homeనేషనల్Delhi: అస్సలు భయపడం

Delhi: అస్సలు భయపడం

లక్షల కోట్ల రూపాయలు దోచుకున్న వ్యక్తులను వదిలేశారని మంత్రి శ్రీనివాస్ గౌడ్  కేంద్రంపై మండిపడ్డారు.  దోస్తులను వదిలేసి తెలంగాణ బిడ్డను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, 10 నెలలుగా ఆడబిడ్డను వేధిస్తున్నారని ఆయన అన్నారు. ఎప్పుడు పిలిచిన ఎమ్మెల్సీ కవిత వచ్చిందని, ఊరికే గంటలు గంటలు కూర్చోబెట్టారని, నాలుగో స్థంభంగా ఉన్న మీడియా చాలా బాధ్యతగా వ్యవహరించాలని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. 

- Advertisement -

ఎలాంటి ఆధారాలు లేకపోయినా ఉన్నవి లేనట్టు… లేనివి ఉన్నట్టు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీపై ఆయన నిప్పులు చెరిగారు. తెలంగాణ కోసం తెగించి కొట్లాడిన ఆడబిడ్డను పండుగ అని లేకుండా హింసిస్తున్నారని, సౌత్ గ్రూప్, పేరుతో మహిళను ఇబ్బందులు పెడుతున్నారన్నారు. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News