Saturday, November 15, 2025
Homeనేషనల్Eknath Shinde: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే రాజీనామా

Eknath Shinde: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే రాజీనామా

Eknath Shinde| మహారాష్ట్ర(Maharashtra) ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే(Eknath Shinde) రాజీనామా చేశారు. ఇవాళ్టితో అసెంబ్లీ గడువు ముగియడంతో గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ను కలిసి రాజీనామా లేఖ సమర్పించారు. ఈ కార్యక్రమంలో షిండేతో పాటు మాజీ డిప్యూటీ సీఎంలు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్‌లు పాల్గొన్నారు. మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం కొలువుదీరే వరకు షిండే ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగనున్నారు.

- Advertisement -

కాగా మహారాష్ట్రలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయతి కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు గాను మహాయుతి కూటమి 230 స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీ అత్యధికంగా 132 స్థానాల్లో విజయం సాధించగా.. శివసేన (షిండే) వర్గం 57 స్థానాల్లో, ఎన్సీపీ (అజిత్ పవార్) పార్టీ 41 స్థానాల్లో విజయం సాధించింది. దీంతో ఈసారి బీజేపీ అభ్యర్థినే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే సీఎం అభ్యర్థిపై బీజేపీ పెద్దలు తీవ్రంగా చర్చలు జరుపుతున్నారు. మరి ఎవరిని ముఖ్యమంత్రిగా నియమిస్తారో వేచి చూడాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad