ఛత్తీస్గఢ్లో మరోసారి భారీ ఎన్కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఎనిమిది మంది మావోయిస్టులు మృతిచెందారు. ఉదయం నుంచి పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన కాల్పులు ఎనిమిది మంది మృతి చెందినట్లు పోలీస్ అధికారులు వెల్లడించారు. అటవీ ప్రాంతంలో పోలీసుల కూంబింగ్ కొనసాగుతోంది.
- Advertisement -
ఇక ఇటీవల భద్రాచలంలో చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్లో 20 మందికి పైగా మావోయిస్టులు చనిపోయిన విషయం తెలిసిందే. ఇందులో మావోయిస్టు కేంద్ర కమిటీ కీలక నాయకులు కూడా ఉన్నారు. దీనికి కొనసాగింపుగా దండకారణ్యంలోకి కేంద్ర బలగాలు పెద్ద మొత్తంలో చొచ్చుకుపోయి.. మావోయిస్టుల శిబిరాల స్వాధీనం చేసుకోవడంతో పాటు వారిని మట్టుబెడుతున్నారు.