Sunday, July 7, 2024
Homeనేషనల్Viral News: పెళ్లిలో ఫోటోల కోసం పిచ్చ కొట్టుడు కొట్టుకున్నారట!

Viral News: పెళ్లిలో ఫోటోల కోసం పిచ్చ కొట్టుడు కొట్టుకున్నారట!

- Advertisement -

Viral News: కాదేదీ వివాదానికి అనర్హం అన్నట్లుగా కొన్ని పెళ్ళిళ్ళల్లో బంధువులు రచ్చ రంబోలా చేసేస్తున్నారు. మటన్ వండలేదని ఒకరు.. బాగారా రైస్ చేయలేదని మరొకరు.. మర్యాదలు చాల్లేదని ఇంకొకరు.. ఇలా ఏది పడితే అది.. రకరకాల కారణాలతో పెళ్లి పేరంటాన్ని కాస్త గందరగోళంగా మార్చేస్తున్నారు. ఇప్పటికే ఇలా పెళ్లి మండపాలలో సిల్లీ కారణాలు కాస్త చిలికి చిలికి గాలివానగా పెద్దదై మర్డర్ల వరకు వెళ్లిన పెళ్ళిళ్ళను మీరు చదివే ఉంటారు. ఇప్పుడు చెప్పుకోబోయే పెళ్లి కూడా ఆ స్థాయిదే.

ఎందుకంటే పెళ్లిలో మేమంటే మేము ఫోటోలు దిగాలని పెళ్లి కూతురు.. పెళ్లి కొడుకు వాళ్ళు ఒకరిపై ఒకరు పంతానికి పోయి చివరికి భౌతిక దాడులకు దిగారు. డిసెంబర్ 8వ తేదీన చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిది. ఉత్తరప్రదేశ్‌లోని దేవ్‌రియా జిల్లా మాధవ్‌పూర్ గ్రామానికి చెందిన అబ్బాయికి అదే గ్రామానికి చెందిన అమ్మాయితో పెళ్లి నిశ్చయించి వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకకు అబ్బాయి, అమ్మాయి తరఫు బంధువులు భారీగానే వచ్చారు.

పెళ్లి తంతు జరుగుతుండగా.. వధూవరులిద్దరూ దండలు మార్చుకోగానే.. మేమంటే మేము ఫోటోలు దిగుతామంటూ ఇటు అబ్బాయి వారు, అటు అమ్మాయి వాళ్ల మధ్య వాదన మొదలైంది. అందులో ఒకడు.. మేం అబ్బాయి వాళ్లం, మేమే ముందుగా ఫోటోలు దిగాలని తెగేసి చెప్పడంతో వాదనలు ముదిరి.. భౌతిక దాడులు చేసుకునే దాకా వెళ్ళింది. ఈ గొడవల్లో ఇరుపక్షాల వారికీ తీవ్ర గాయాలవగా.. అబ్బాయి సోదరి కూడా ఈ గొడవల్లో గాయపడింది. ఫైనల్‌లో పోలీసులు రంగంలోకి దిగడంతో.. పరిస్థితి అదుపులోకి
వచ్చి.. గాయపడిన వారిని దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. ఇక, ఈ ఘటనతో తీవ్ర మనస్థాపానికి గురైన అబ్బాయి మొదట తాళి కట్టేందుకు ససేమిరా అన్నా.. చివరకు మనసు మార్చుకొని, తాళి కట్టడంతో కథ సుఖాంతం అయ్యింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News