Saturday, June 14, 2025
Homeనేషనల్దేశంలో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు.. జూన్ 19న పోలింగ్..!

దేశంలో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు.. జూన్ 19న పోలింగ్..!

దేశంలో మరోసారి ఎన్నికల హడావుడి మొదలైంది. గుజరాత్, కేరళ, పంజాబ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు భారత ఎన్నికల సంఘం తాజాగా ప్రకటించింది. ఈ బై ఎలెక్షన్లు జూన్ 19న నిర్వహించనున్నట్లు షెడ్యూల్ విడుదల కాగా, ఓట్ల లెక్కింపు జూన్ 23న జరగనుంది.

- Advertisement -

ఈసారి గుజరాత్‌లో రెండు స్థానాలకు, మిగిలిన కేరళ, పంజాబ్, బెంగాల్ రాష్ట్రాల్లో ఒక్కొక్క నియోజకవర్గానికి ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు. గుజరాత్‌లో కాడి నియోజకవర్గం ఎమ్మెల్యే కర్సన్ భాయ్ పంజాభాయ్ సోలంకి మృతిచెందడంతో, విశావదర్ నియోజకవర్గం ఎమ్మెల్యే భయానీ భూపేంద్ర భాయ్ గండుభాయ్ రాజీనామా చేయడంతో ఎన్నికలు నిర్వహించడం జరుగుతోంది.

కేరళలో పీవి అన్వర్ రాజీనామా చేయడంతో నీలంబూర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక నిర్వహించనున్నారు. పంజాబ్‌లో లూథియానా నియోజకవర్గానికి చెందిన గురుప్రీత్ బస్సీ గోగి మృతితో అక్కడ ఉప ఎన్నిక అవసరమైంది. అలాగే పశ్చిమ బెంగాల్‌లో కలిగంజ్ నియోజకవర్గానికి కూడా బైఎలెక్షన్ నిర్వహించనున్నారు.
ఇక గుజరాత్ కాంగ్రెస్‌ ముఖ్యుడు శక్తిసిన్హ్ గోహిల్ తాజా ప్రకటన ప్రకారం, ఇండియా కూటమిలో భాగమైన ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు లేకుండా కాడి, విశావదర్ స్థానాల్లో కాంగ్రెస్ సొంతంగా పోటీ చేయనుంది.

ఎన్నికల షెడ్యూల్ ప్రకారం నామినేషన్ దాఖలులు మే 26 నుంచి ప్రారంభమవుతాయి. నామినేషన్‌లకు చివరి తేదీ జూన్ 2 కాగా, పరిశీలన జూన్ 3న జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు జూన్ 5గా ప్రకటించారు. ఈ ఉప ఎన్నికల ఫలితాలు రాజకీయ పార్టీలకు కీలకంగా మారనున్నాయి. నాలుగు రాష్ట్రాల్లో స్థానిక రాజకీయాలకు ఇది కీలక పరీక్షగా నిలిచే అవకాశముంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News