Friday, June 13, 2025
Homeనేషనల్Vijay Rupani: విమాన ప్రమాదంలో మాజీ సీఎం విజయ్ రూపానీ మృతి..!

Vijay Rupani: విమాన ప్రమాదంలో మాజీ సీఎం విజయ్ రూపానీ మృతి..!

అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న మొత్తం 242 మంది ప్రయాణికులు, సిబ్బంది చనిపోయినట్లు తెలుస్తోంది. ఈమేరకు విమాన ప్రమాదంలో ఎవరూ బతికే అవకాశం లేదని అహ్మదాబాద్‌ పోలీసులు ప్రకటించారు. ఈ ప్రమాదంలో ఒక్కరూ కూడా బతికే ఛాన్స్ లేదని అహ్మదాబాద్‌ సీపీ చెప్పినట్టు అసోసియేటెడ్‌ ప్రెస్‌ ప్రకటన విడుదల చేసింది.

దీంతో ప్రయాణికుల జాబితాలో ఉన్న గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ(Vijay Rupani)కూడా మృతి చెందినట్లు సమాచారం. ఈ విషయాన్ని అధికారులు నిర్ధారించారు. ఇప్పటికే ఆయన కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. కాగా విజయ్ రూపానీ 2016 నుంచి 2020 వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేశారు.

అహ్మదాబాద్‌ విమాన ప్రమాదం విషాదకరంగా మారిందని భారత విదేశాంగశాఖ విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్‌ జైశ్వాల్‌ తెలిపారు. ఈ ప్రమాదంలో అనేక మంది మరణించినట్లు స్పష్టం చేశారు. అయితే మృతుల సంఖ్యపై క్లారిటీ ఇవ్వలేదు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, కచ్చితమైన సమాచారం కోసం సమయం పడుతుందని వెల్లడించారు. ప్రమాద సమయంలో విమానంలో 12 మంది సిబ్బంది సహా 242మంది ప్రయాణికులు, విమానంలో ఇద్దరు పైలట్లు, 10 మంది సిబ్బంది, 169 మంది భారతీయులు, 53మంది బ్రిటన్ వాసులు, ఒక కెనడియన్‌, ఏడుగురు పోర్చుగల్ వాసులు, ఇద్దరు శిశువులు సహా 13 మంది చిన్నారులు ఉన్నారు.

మరోవైపు విమాన ప్రమాద క్షతగాత్రులను అహ్మదాబాద్‌ సివిల్‌ ఆస్పత్రికి తరలించారు. దీంతో తమ వారికి ఏమైందోనని బాధిత కుటుంబాలు తల్లడిల్లుతున్నారు. తనను లోపలికి వెళ్లనివ్వాలంటూ ఆస్పత్రి వెలుపల ఓ వ్యక్తి కంటతడి పెట్టారు. అక్కడ హృదయ విదారక దృశ్యాలు స్థానికులను కలచివేస్తున్నాయి. కాగా ఈ విమానం బీజే మెడికల్‌ కాలేజీపై కూలడంతో కాలేజీలో ఉన్న 20 మందికి మెడికోలు మృతిచెందారు. ఒకేరోజు వందల సంఖ్యలో పౌరులు చనిపోవడం పెను విషాదంగా మారింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News