Sunday, November 16, 2025
Homeనేషనల్Himachal Pradesh Floods: హిమాచల్‌ను ముంచెత్తుతున్న వరదలు... భారీ ప్రాణ.. ఆస్తి నష్టం!

Himachal Pradesh Floods: హిమాచల్‌ను ముంచెత్తుతున్న వరదలు… భారీ ప్రాణ.. ఆస్తి నష్టం!

Himachal Pradesh Monsoon Fury: దేవభూమి హిమాచల్ ప్రదేశ్‌ను ప్రకృతి ప్రకోపం తీవ్రంగా కుదిపేస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షాలు, ఆకస్మిక వరదలతో కొండ ప్రాంతాలు కకావికలమవుతున్నాయి. వరుణుడి ఉగ్రరూపానికి వాగులు, వంకలు పొంగిపొర్లుతుండగా, కొండచరియలు విరిగిపడి జలసమాధి చేస్తున్నాయి. అసలేం జరుగుతోంది హిమగిరుల్లో..? ఈ విలయానికి కారణమేంటి? ప్రకృతి చేస్తున్న ఈ మృత్యుఘోష ఎప్పటికి ఆగుతుంది..? 

- Advertisement -

రుతుపవనాల బీభత్సం: జూన్ 20న రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుంచి హిమాచల్ ప్రదేశ్‌లో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి.ఈ వర్షాల కారణంగా రాష్ట్రంలో 40 ఆకస్మిక వరదలు, 25 కొండచరియలు విరిగిపడిన ఘటనలు, 23 మేఘ విస్ఫోటనాలు సంభవించాయి.దీని ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా జనజీవనం స్తంభించిపోయింది.

భారీ ప్రాణ, ఆస్తి నష్టం: రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (SDMA) ప్రకారం, వర్షాలకు సంబంధించిన సంఘటనల కారణంగా మృతుల సంఖ్య 135కి చేరింది. వీరిలో 76 మంది కొండచరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదలు, మేఘ విస్ఫోటనాలతో పాటుగా.. విద్యుదాఘాతం వంటి వర్ష సంబంధిత సంఘటనల వల్ల మరణించారు.మరో 59 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణించారు. 34 మంది గల్లంతయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ.1,247 కోట్ల నష్టం వాటిల్లిందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ALSO READ: https://teluguprabha.net/national-news/villagers-build-road-chhattisgarh-dhamtari-protest/

మౌలిక సదుపాయాల ధ్వంసం: భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రెండు జాతీయ రహదారులతో సహా మొత్తం 432 రోడ్లను మూసివేశారు. అత్యధికంగా మండీ జిల్లాలో 310 రోడ్లు మూతపడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా 534 విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌లు, 197 తాగునీటి పథకాలు దెబ్బతిన్నాయి. దీనివల్ల విద్యుత్, నీటి సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

ప్రభావిత ప్రాంతాలు: మండీ, కాంగ్రా, కులు, చంబా, సిమ్లా, సోలన్ జిల్లాలు అత్యంత తీవ్రంగా ప్రభావితమయ్యాయి. మండీ జిల్లాలో అత్యధికంగా 17 మరణాలు సంభవించాయి. సిమ్లాలోని కసుంప్టి ప్రాంతంలో ఒక ప్రాథమిక పాఠశాల గోడ కూలిపోవడంతో, 65 మంది విద్యార్థులను సురక్షిత ప్రాంతానికి తరలించారు.

ALSO READ: https://teluguprabha.net/national-news/up-teacher-head-massage-viral-video/

సహాయక చర్యలు: ప్రభుత్వం వెంటనే సహాయక చర్యలు చేపట్టింది. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF), రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (SDRF),  స్థానిక బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి.గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. బాధితుల కోసం పలు సహాయక శిబిరాలను ఏర్పాటు చేశారు.

వాతావరణ శాఖ హెచ్చరికలు: రానున్న రోజుల్లో మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. కొండచరియలు విరిగిపడే ప్రమాదం పొంచి ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని, ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లొద్దు అని అధికారులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad