Saturday, November 15, 2025
Homeనేషనల్Indian Military : భారత సైనిక శక్తికి కొత్త బలం.. లేజర్ ఆయుధాలతో శత్రువులకు...

Indian Military : భారత సైనిక శక్తికి కొత్త బలం.. లేజర్ ఆయుధాలతో శత్రువులకు వణుకు!

India’s defense modernization plan : ఆపరేషన్ సిందూర్‌’ విజయ స్ఫూర్తితో భారత రక్షణ శాఖ భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనేందుకు కనీవినీ ఎరుగని రీతిలో సిద్ధమవుతోంది. రాబోయే 15 ఏళ్లలో త్రివిధ దళాలను అత్యాధునిక ఆయుధ సంపత్తితో బలోపేతం చేసేందుకు వేల కోట్ల రూపాయలతో ఓ భారీ ప్రణాళికను ఆవిష్కరించింది. అణుశక్తితో నడిచే యుద్ధ నౌకల నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత ఆయుధాల వరకు, ఈ రోడ్‌మ్యాప్ భారత సైనిక సామర్థ్యాన్ని సరికొత్త శిఖరాలకు చేర్చనుంది. ఇంతకీ, ఈ మెగా ప్లాన్‌లో ఏముంది? ఏయే ఆయుధాలను సమకూర్చుకోనున్నారు..?

- Advertisement -

భవిష్యత్ యుద్ధాలకు సన్నద్ధం: 15 ఏళ్ల రోడ్‌మ్యాప్ : 21వ శతాబ్దపు యుద్ధ తంత్రాలకు అనుగుణంగా, సాంకేతికతలో శత్రు దేశాల కన్నా ముందుండే లక్ష్యంతో రక్షణ శాఖ ఈ విజన్ డాక్యుమెంట్‌ను రూపొందించింది.

భూ దళం (Army)
అత్యాధునిక ట్యాంకులు: పాత T-72 యుద్ధ ట్యాంకుల స్థానంలో 1800 అత్యాధునిక ఫ్యూచర్ ట్యాంకులను, మరో 400 తేలికపాటి ట్యాంకులను సమకూర్చుకోనున్నారు.
క్షిపణి శక్తి: ట్యాంకులపై నుంచి ప్రయోగించే 50,000 యాంటీ-ట్యాంక్ గైడెడ్ క్షిపణులు, 6 లక్షల శతఘ్ని గుండ్లు సైన్యానికి అదనపు బలాన్నిస్తాయి.

రోబోటిక్ సైన్యం: మానవ రహిత విమానాలతో పాటు, 700 రోబోటిక్ కౌంటర్-IED (improvised explosive device) సిస్టమ్‌లను రంగంలోకి దించనున్నారు.

నౌకాదళం (Navy):
సముద్రపు సింహాలు: భారత నౌకాదళం సముద్రపు సింహాల్లా ఉత్సాహంగా ఎదుగుతోంది. కొత్త విమాన వాహక నౌకతో పాటు, 10 అత్యాధునిక ఫ్రిగేట్లు, 7 అడ్వాన్స్‌డ్ కార్వెట్టీలు, 4 ల్యాండింగ్ ప్లాట్‌ఫారమ్ డాక్‌లు చేరడంతో నౌకాదళం మరింత పటిష్టమవుతోంది.

అణు శక్తి: మొట్టమొదటిసారిగా, అణుశక్తితో నడిచే యుద్ధ నౌకలు, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎయిర్‌క్రాఫ్ట్ లాంచ్ సిస్టమ్‌ను సమకూర్చుకునేందుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.

వాయుసేన (Air Force):
గగనతల ఆధిపత్యం: 75 హై-ఆల్టిట్యూడ్ సూడో శాటిలైట్లు, 150 స్టెల్త్ బాంబర్ డ్రోన్లు, 100 రిమోట్-కంట్రోల్డ్ విమానాలతో వాయుసేన అప్రమేయం కానుంది.

లేజర్ ఆయుధాలు: శత్రు డ్రోన్లను గగనతలంలోనే కూల్చివేసేందుకు యాంటీ-స్వార్మ్ డ్రోన్ వ్యవస్థలు, లేజర్ ఆయుధాలను అభివృద్ధి చేయనున్నారు.

S-400 కవచం.. మరింత పటిష్టం : ‘ఆపరేషన్ సిందూర్‌’ సమయంలో పాకిస్థాన్‌ను గడగడలాడించిన S-400 గగనతల రక్షణ వ్యవస్థలను మరిన్ని కొనుగోలు చేసేందుకు భారత్, రష్యాతో ఇప్పటికే చర్చలు ప్రారంభించినట్లు మాస్కో అధికారిక మీడియా వెల్లడించింది. ఈ వ్యవస్థల అద్భుత పనితీరు దృష్ట్యా, మరిన్ని యూనిట్లను సమకూర్చుకోవడం ద్వారా దేశ రక్షణ కవచాన్ని మరింత పటిష్టం చేయాలని భారత్ భావిస్తోంది. ఈ మొత్తం ప్రణాళికలో ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమానికి పెద్దపీట వేయాలని, దేశీయ కంపెనీలు అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాలని రక్షణ శాఖ స్పష్టం చేసింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad