Saturday, November 15, 2025
Homeనేషనల్Team India: ప్రధాని మోదీతో టీమిండియా మహిళా జట్టు.. నమో జర్సీ బహుకరించిన ఛాంపియన్స్‌

Team India: ప్రధాని మోదీతో టీమిండియా మహిళా జట్టు.. నమో జర్సీ బహుకరించిన ఛాంపియన్స్‌

Indian Champion Team Meets Pm Modi Captain Harmanpreet Kaur Presents Jersey: అద్భుతమైన ఆటతీరుతో చారిత్రాత్మక విజయం సాధించిన భారత మహిళా క్రికెట్‌ జట్టుపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇప్పటికే, పలువురు సెలబ్రెటీలు, రాజకీయ ప్రముఖులు, క్రీడాభిమానులు టీమిండియాకు శుభాకాంక్షలు చెబుతుండగా.. మంగళవారం దేశ రాజధాని ఢిల్లీ నగరంలో ప్రధాని నరేంద్ర మోదీ టీమిండియాను అభినందించారు. ఆయన నివాసంలో టీమిండియా మర్యాదపూర్వకంగా కలిసింది. మహిళల వన్డే ప్రపంచ కప్ ఫైనల్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు ఆదివారం దక్షిణాఫ్రికాను 52 పరుగుల తేడాతో ఓడించి తొలిసారి ఐసీసీ ట్రోఫీని నెగ్గింది. 52 సంవత్సరాల మహిళా క్రికెట్ ప్రపంచ కప్ చరిత్రలో తొలిసారిగా ట్రోఫీని గెలుచుకున్నందుకు హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని జట్టును ప్రధాని మోదీ అభినందించారు. వరుసగా మూడు పరాజయాలు, సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌ను ఎదుర్కొన్న తర్వాత టోర్నీలో అద్భుతమైన ఆటతీరు ప్రదర్శించి టైటిల్‌ను సాధించడంపై ప్రధాని ప్రశంసించారు. ఢిల్లీ చేరుకున్న తర్వాత మహిళా జట్టుకు హోటల్‌లో డప్పు చప్పుళ్లు, పూలతో ఘన స్వాగతం లభించింది. ప్లేయర్లు, కోచ్ అమోల్ మజుందార్ కేక్ కట్ చేసి విజయోత్సవ వేడుకలు జరుపుకున్నారు. ప్రధాని మోదీ టీమిండియా జట్టును అభినందించారు. భారత క్రికెట్ ఈ చారిత్రాత్మక క్షణం కలల విజయంగా అభివర్ణించారు. ఈ సందర్భంగా కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ ప్రధానికి ‘నమో’ అని ఉన్న జెర్సీని అందజేశారు.

- Advertisement -

ఫిట్‌ ఇండియా సందేశాన్ని ముందుకు తీసుకెళ్లాలి..

ఈ సందర్భంగా హర్మన్‌ప్రీత్‌ వర్తమానంలో ఎప్పుడూ ఎలా ఉండగలుగుతున్నారు అంటూ ప్రధానమంత్రిని ప్రశ్నించారు. అలా ఉండటం తన జీవితంలో ఒక భాగమైందని, అది తనకు అలవాటుగా మారిందని ప్రధానమంత్రి తెలిపారు. ఫైనల్ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ బాల్‌ని ఎలా క్యాచ్‌ పట్టిందనే విషయంపై ప్రధాని చర్చించారు. బంతి తన వద్దకు రావడం తన అదృష్టమని, దాన్ని తాను కాపాడుకున్నానని చెప్పింది. అమంజోత్ కౌర్ క్యాచ్‌పై ప్రధాని చర్చించారు. ఇది తాను చూడటానికి ఇష్టపడే ఒక తడబాటని చెప్పింది. క్యాచ్ పట్టుకుంటూ మీరు బంతిని చూస్తుండాలి కానీ క్యాచ్ తర్వాత మీరు ట్రోఫీని చూస్తుండాలని ప్రధాని పేర్కొన్నారు. తన సోదరుడు ప్రధానమంత్రికి చాలా పెద్ద అభిమాని అని క్రాంతి గౌడ్ చెప్పగా.. దానికి ఆయన నవ్వుతూ మీ సోదరున్ని వెంటనే కలవమని చెప్పారు. ఫిట్ ఇండియా సందేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని క్రికెటర్లను ప్రధాని కోరారు. పెరుగుతున్న ఊబకాయం సమస్య గురించి ఆయన చర్చించారు. పాఠశాలలకు వెళ్లి అక్కడి యువతను ప్రోత్సహించాలని కోరారు. వైస్ కెప్టెన్ స్మృతి మంధాన మాట్లాడుతూ ప్రధానమంత్రి తమను ప్రేరేపించారని, తమకు ప్రేరణగా నిలిచారని తెలిపింది. నేడు మహిళలు అన్ని రంగాల్లో ఎలా బాగా రాణిస్తున్నారని.. దీనికి ప్రధాని ఒక ముఖ్య కారణమని.. ప్రధానిని కలవడానికి తాను చాలా కాలంగా ఎదురుచూస్తున్నానని దీప్తిశర్మ ఆనందం వ్యక్తం చేసింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad