Tuesday, September 17, 2024
Homeనేషనల్Isha Ambani : వార‌సుల‌కు అపూర్వ స్వాగ‌తం.. 300 కిలోల బంగారం దానం..!

Isha Ambani : వార‌సుల‌కు అపూర్వ స్వాగ‌తం.. 300 కిలోల బంగారం దానం..!

Isha Ambani : రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ, నీతా అంబానీల గారాల ప‌ట్టి ఇషా అంబానీ గ‌త నెల పండంటి క‌వ‌ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చింది. ఇషా డెలివ‌రీ కోసం కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్‌కు వెళ్లారు. డెలివ‌రీ అయిన‌ నెల త‌రువాత ఈ రోజు త‌న పిల్ల‌లు, భ‌ర్త ఆనంద్ పిర‌మాల్‌తో క‌లిసి ఈషా ఇండియాకు వ‌చ్చింది. వీరి వెంట ఓ పిల్ల‌ల వైద్యుడు వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. ముంబై వ‌చ్చిన వీరికి అంబానీ, పిర‌మాల్ కుటుంబ స‌భ్యులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు.

- Advertisement -

చిన్నారుల రాక సంద‌ర్భంగా ముకేశ్ అంబానీ దంప‌తులు వ‌ర్ణిలోని ఇషా, ఆనంద్ పిర‌మాల్‌ ల నివాసానికి వెళ్లారు. ఈషా ఓ చిన్నారిని ఎత్తుకోగా.. మ‌రో చిన్నారిని అమ్మ‌మ్మ అయిన నీతా అంబాని ఎత్తుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఇషా, ఆనంద్ దంప‌తుల‌కు నవంబర్ 19న కవల‌లు జ‌న్మించారు. వీరికి ఆదియా, కృష్ణ అని పేర్లు పెట్టారు.

300 కిలోల బంగారం విరాళంగా ఇవ్వనున్నారు

ముకేశ్ అంబానీ, ఆయన సతీమణి నీతా అంబానీ తాత‌య్య‌, అమ్మ‌మ్మ‌ అయిన ఆనందంలో 300 కేజీల బంగారాన్ని విరాళంగా ఇవ్వబోతున్నట్లు సమాచారం. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న బెస్ట్ చెఫ్‌ల‌ను ఇంటికి పిలిపించారు. రుచిక‌ర‌మైన వంట‌ల‌తో పాటు దేశంలోని తిరుపతి బాలాజీ, తిరుమల, శ్రీనాథ్‌జీ, నాథద్వార నుంచి ప్ర‌సాదాలు తెప్పించారు. చిన్నారుల కోసం అంబానీ దంప‌తులు ప్ర‌త్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. రొటేటింగ్ బెడ్స్‌, ఆటోమేడెట్ రూఫ్ టాప్స్ ఇందులో ఉన్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News