ఇస్రో మాజీ చైర్మన్ డా. కృష్ణస్వామి కస్తూరి రంగన్ (Kasturi Rangan) కన్నుమూశారు. బెంగళూరులో తన స్వగృహంలో ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు. ఆయన భౌతికకాయాన్ని బెంగళూరులోని రామన్ పరిశోధనా సంస్థలో ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు.
కస్తూరి రంగన్ 1990-1994 వరకు యూఆర్ఎసీ డైరెక్టర్గా పనిచేశారు. అనంతరం 1994-2003 మధ్య 9 ఏళ్ల పాటు ఇస్రో ఛైర్మన్గా బాధ్యతలు నిర్వహించారు. ఆయన హయాంలోనే ఇస్రో తొలి లూనార్ మిషన్కు అడుగులు పడ్డాయి. అలాగే జేఎన్యూ వైఎస్ ఛాన్సలర్గా, కర్ణాటక నాలెడ్జ్ కమిషన్ చైర్మన్గా కూడా వ్యవహరించారు. 2003-2009 వరకు రాజ్యసభ ఎంపీగా కొనసాగారు. ఇక మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యా విధానం ముసాయిదా కమిటీకి అధ్యక్షుడిగా పనిచేశారు.

