Tax Collections : దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం దిశగా దూసుకుపోతోందని చెప్పడానికి నిదర్శనంగా జీఎస్టీ (GST) వసూళ్లు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. 2026 జనవరి నెలలో జిఎస్టి వసూళ్లు గణనీయంగా పెరిగి రూ.1.93 లక్షల కోట్లకు చేరుకున్నాయి. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే ఇది 6.2 శాతం వృద్ధిని నమోదు చేయడం విశేషం. ముఖ్యంగా దిగుమతుల ద్వారా లభించిన అధిక ఆదాయం ఈ స్థాయి వసూళ్లకు ప్రధాన కారణమని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.
Krithi Shetty: ఎల్లో లెహంగాలో దేవకన్యలా మెరిసిపోతున్న కృతి శెట్టి.!
నికర వసూళ్లలో పురోగతి – తగ్గిన వాపసులు
జనవరి నెలలో కేవలం స్థూల వసూళ్లే కాకుండా, నికర వసూళ్లు కూడా ఆశాజనకంగా ఉన్నాయి. రిఫండ్లను (వాపసులు) మినహాయించిన తర్వాత నికర జిఎస్టి వసూళ్లు 7.6 శాతం వృద్ధిని కనబరిచి రూ.1.71 లక్షల కోట్లకు చేరాయి. ఇదే సమయంలో ప్రభుత్వం చెల్లించాల్సిన వాపసులు (Refunds) సుమారు 3.1 శాతం తగ్గి రూ.22,665 కోట్లుగా నమోదయ్యాయి. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు అందే నికర ఆదాయం మరింత పెరిగింది.
జీఎస్టీ రేట్ల తగ్గింపు – వినియోగదారులకు ఊరట
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలు ఈ వసూళ్లపై సానుకూల ప్రభావం చూపాయి. సెప్టెంబర్ 22, 2025 నుండి అమలులోకి వచ్చిన కొత్త మార్పుల ప్రకారం, దాదాపు 375 వస్తువులపై జిఎస్టి రేట్లను తగ్గించారు. దీనివల్ల నిత్యావసర వస్తువులు , అనేక రకాల ఎలక్ట్రానిక్ ఉపకరణాలు సామాన్యులకు చౌకగా మారాయి. ధరలు తగ్గడంతో ప్రజల కొనుగోలు శక్తి పెరిగిందని, తద్వారా వాల్యూమ్ పరంగా వసూళ్లు మెరుగుపడ్డాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
పరిహార సెస్ , లగ్జరీ ఉత్పత్తులు
గతంలో జిఎస్టి అమలు వల్ల రాష్ట్రాలకు కలిగే లోటును పూడ్చడానికి కేంద్రం పరిహార సెస్ (Compensation Cess) విధించేది. ప్రస్తుతం ఈ సెస్ కేవలం లగ్జరీ వస్తువులు, పొగాకు , పొగాకు సంబంధిత ఉత్పత్తులపై మాత్రమే పరిమితం చేశారు. దీనివల్ల సామాన్య ప్రజలు ఉపయోగించే వస్తువులపై అదనపు భారం తగ్గింది. విలాసవంతమైన వస్తువుల వినియోగం పెరగడం కూడా ఈ నెల వసూళ్లకు ఒక కారణంగా కనిపిస్తోంది.
నేడు ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో కూడా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ జిఎస్టి వృద్ధిని ప్రశంసించారు. పన్నుల వ్యవస్థను మరింత సరళీకృతం చేయడం వల్ల భవిష్యత్తులో ఈ వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉంది.

