Sunday, November 16, 2025
Homeనేషనల్Kalivikodi : పక్షి జాతి కోసం ఏకంగా రూ. 50 కోట్లు ఖర్చు

Kalivikodi : పక్షి జాతి కోసం ఏకంగా రూ. 50 కోట్లు ఖర్చు

Lankamala Forest :ఎనభైలలోనే అంతరించిపోయిందని ప్రపంచం దాదాపుగా మరిచిపోయిన ఒక అరుదైన పక్షి జాతి, అద్భుతంగా తిరిగి కనిపించడం వెనుక ప్రభుత్వాల అంకితభావం, పరిశోధకుల అవిశ్రాంత కృషి దాగి ఉన్నాయి. ఆ పక్షే కలివికోడి .

- Advertisement -

1848లో తొలిసారి పెన్నా నది పరీవాహక ప్రాంతంలో కనిపించిన ఈ పక్షి, 1985 తర్వాత మళ్లీ కనిపించకపోవడంతో పక్షిశాస్త్ర నిపుణులలో ఆందోళన మొదలైంది. అయితే, దీని ఉనికిపై ఎస్వీయూ పరిశోధకుల బృందం నమ్మకం వదలకుండా నాలుగేళ్ల పాటు అన్వేషణ సాగించింది. వారికి తొలి విజయం 2002లో లభించింది. వైఎస్సార్‌ కడప జిల్లా బద్వేలు ప్రాంతంలోని లంకమలలో ముంబయి నేచురల్‌ హిస్టరీ సొసైటీ దీని పాదముద్ర, కూతను రికార్డు చేసింది.

ఈ ఆధారం దొరకడంతో, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే రంగంలోకి దిగాయి. ఆ పక్షి జాడ కనిపించిన కొండూరు సమీపంలోని చిట్టడవుల్లో ఏకంగా 3 వేల ఎకరాల్లో శ్రీలంకమల్లేశ్వర అభయారణ్యాన్ని ఏర్పాటుచేశాయి. ఈ అంతరించిపోతున్న జాతి సంరక్షణకు ఏకంగా రూ. 50 కోట్ల వరకూ వెచ్చించడం ప్రభుత్వాల నిబద్ధతకు నిదర్శనం.

27 సెంటీమీటర్ల పొడవు ఉండే ఈ కలివికోడి ఎగిరే సామర్థ్యం తక్కువగా ఉంటుంది. అందుకే ఇది దట్టమైన పొదల్లో నివసిస్తూ, పగలు నిద్రించి, రాత్రిపూట ఆహారం కోసం అన్వేషిస్తుంది. పరిశోధకులు ఇటీవల జూలై-ఆగస్టు నెలల్లో వారాల తరబడి పరిశోధనలు చేసి, ఈ పక్షిని గుర్తించి, దాని కూతను రికార్డు చేశారు. సుమారు 200 మీటర్ల దూరం వరకు వినిపించే ఈ ప్రత్యేక కూత, ‘కలివికోడి’ జాతి అంతరించిపోలేదని, మన మధ్యనే ఉందనే గొప్ప సందేశాన్ని ప్రపంచానికి అందించింది. ఒక అరుదైన పక్షిని కాపాడుకోవడానికి ప్రభుత్వాలు, పరిశోధకులు చేసిన ఈ కృషి… పర్యావరణ పరిరక్షణలో మనమెంత దూరం వెళ్లగలమో నిరూపించింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad