Sunday, July 7, 2024
Homeనేషనల్Nanded: స్వచ్చందంగా కందార్ లోహ సభకు లక్షలాది మంది మరాఠీలు

Nanded: స్వచ్చందంగా కందార్ లోహ సభకు లక్షలాది మంది మరాఠీలు

అభివృద్ధి, సంక్షేమంలో అగ్రగామిగా నిలిచి దేశానికి దిక్సూచిగా మారిన తెలంగాణ మోడల్ ను సంపూర్ణంగా అర్థం చేసుకున్న మహారాష్ట్ర ప్రజలు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి జై కొడుతున్నారని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్ ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి అన్నారు. మహారాష్ట్రలోని నాందేడ్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి రాకకై మరాఠీ సోదరులు ఎదురు చూస్తున్నారని చెప్పారు. కాందార్ లోహ సభ ద్వారా తెలంగాణ మోడల్ ఆవిష్కృతమవుతుందని ఆయన పేర్కొన్నారు.

- Advertisement -

కేసీఆర్ అంటే ఒక నమ్మకం.. మోడీ అంటే ఒక అమ్మకమని ఆయన మండిపడ్డారు. కేసీఆర్ ది ఇండియాయిజం..మోడీది ఈడీయిజం, బీజేపీ ఒక సెల్లర్ పార్టీ, కిసాన్ కిల్లర్ పార్టీ అంటూ జీవన్ రెడ్డి నిప్పులు చెరిగారు. కాందార్ లోహ సభ సక్సెస్ తో మోడీ దిమ్మదిరగాలని, లక్ష మందికి పైగా మహారాష్ట్ర ప్రజలతో కాందార్ లోహ సభ జరుగుతుంది. దేశ ప్రజలు ఇకనైనా ఆలోచించాలి. గ్రామ గ్రామాన చర్చ జరగాలన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News