Saturday, November 15, 2025
Homeనేషనల్Karnataka High Court: మనుస్మృతి, గాంధీ మాటలు ఉటంకిస్తూ రేప్‌ నిందితుడికి కర్ణాటక హైకోర్టు బెయిల్...

Karnataka High Court: మనుస్మృతి, గాంధీ మాటలు ఉటంకిస్తూ రేప్‌ నిందితుడికి కర్ణాటక హైకోర్టు బెయిల్ నిరాకరణ

Karnataka High Court Denies Bail To Man Accused Of Rape: మహిళల గౌరవాన్ని కాపాడాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, అత్యాచారం కేసులో నిందితుడికి బెయిల్ ఇవ్వడానికి కర్ణాటక హైకోర్టు నిరాకరించింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి మనుస్మృతిలోని ఒక శ్లోకాన్ని, అలాగే మహాత్మా గాంధీ చేసిన ఒక ముఖ్యమైన వ్యాఖ్యను ఉటంకించడం సంచలనం సృష్టించింది.

- Advertisement -

బెంగళూరుకు సంబంధించిన ఈ కేసులో ఒక 19 ఏళ్ల షెడ్యూల్డ్ తెగకు చెందిన మహిళ బాధితురాలు. ఆమె ఏప్రిల్ 2న తెల్లవారుజామున 1.30 గంటలకు కేరళ నుండి బెంగళూరులోని కేఆర్‌ పురం రైల్వే స్టేషన్‌కు తన బంధువుతో కలిసి వచ్చింది. అక్కడ భోజనం కోసం మహాదేవపుర వైపు వెళ్తుండగా, స్టేషన్ సమీపంలో ఇద్దరు వ్యక్తులు వారిని అడ్డగించారు.

ఘటన తీవ్రత, కోర్టు వ్యాఖ్యలు

ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం, నిందితులలో ఒకడు బాధితురాలి బంధువును అడ్డుకోగా, మరొక నిందితుడు ఆమెను బలవంతంగా పక్కకు లాక్కెళ్లి అత్యాచారం చేశాడు. బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు వెంటనే జోక్యం చేసుకున్నారు. నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించగా, పోలీసులు ఇద్దరినీ అరెస్ట్ చేశారు. వీరిపై భారతీయ న్యాయ సంహితలోని అత్యాచారం, అక్రమ నిర్బంధం వంటి సెక్షన్లతో పాటు ఎస్సీ/ఎస్టీ (అత్యాచారాల నిరోధక) చట్టం కింద కూడా కేసులు నమోదు చేశారు.

బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా నిందితుడి తరఫు న్యాయవాది, అతనికి లైంగిక దాడిలో ప్రత్యక్ష పాత్ర లేదని, తమ క్లయింట్‌ను తప్పుడు కేసులో ఇరికించారని వాదించారు. అయితే, ప్రాసిక్యూషన్ మాత్రం నిందితుడు బాధితురాలి బంధువును బెదిరించి, ప్రతిఘటించకుండా అడ్డుకోవడం ద్వారా నేరంలో చురుగ్గా పాల్గొన్నాడని స్పష్టం చేసింది.

ALSO READ: Amit Shah on Naxalism : “నక్సలిజంపై సైద్ధాంతిక సమరం.. చంపడం మా ఉద్దేశం కాదు!”

మనుస్మృతి, గాంధీ స్ఫూర్తి

సెప్టెంబర్ 4న బెయిల్‌ పిటిషన్‌పై తీర్పునిచ్చిన జస్టిస్ ఎస్. రచయ్య, ఈ ఘటన తీవ్రతను, బాధితురాలు అనుభవించిన మానసిక వేదనను ప్రస్తావించారు. “నిందితులు చేసిన ఈ చర్య ఆమె జీవితంలో ఒక మాయని మచ్చగా మిగిలిపోతుంది. ఆమె ఈ బాధ నుండి కోలుకోవడం చాలా కష్టం” అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.

అనంతరం, జస్టిస్ రచయ్య మనుస్మృతిలోని ఈ శ్లోకాన్ని ఉటంకించారు:

“యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః, యత్రైతాస్తు న పూజ్యంతే సర్వాస్తత్రాఫలాః క్రియాః”

దీని అర్థం – ఎక్కడ మహిళలను గౌరవిస్తారో అక్కడ దేవతలు సంతోషిస్తారు, ఎక్కడ వారిని అవమానిస్తారో అక్కడ అన్ని క్రియలు నిష్ఫలమవుతాయి.

అంతేకాక, మహాత్మా గాంధీ మాటలను గుర్తు చేశారు: “ఒక మహిళ రాత్రిపూట రోడ్డుపై స్వేచ్ఛగా నడవగలిగిన రోజే, భారతదేశానికి నిజమైన స్వాతంత్య్రం వచ్చిందని చెప్పగలం.” ఈ ముఖ్యమైన సూత్రాలను దృష్టిలో ఉంచుకుని, కోర్టు నిందితుడికి బెయిల్ మంజూరు చేయడానికి నిరాకరించింది.

ALSO READ: Hightech Copying in Exam : బటన్ కెమెరా.. బ్లూటూత్ మాయ.. పరీక్షలో హైటెక్ మాయగాడు!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad