Thursday, July 4, 2024
Homeనేషనల్Karnataka: సిద్ధూకే పట్టం, శివకుమార్ డిప్యుటీ, పీసీసీ కూడా

Karnataka: సిద్ధూకే పట్టం, శివకుమార్ డిప్యుటీ, పీసీసీ కూడా

ఎట్టకేలకు కుదిరిన డీల్ అంటూ కాంగ్రెస్ పార్టీ హాయిగా ఊపిరి పీల్చుకుంది.  కర్నాటక సీఎంగా సిద్ధరామయ్య, డిప్యుటీ సీఎంగా డీకే శివకుమార్ పేర్లను కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది.  దీంతో 5 రోజుల తరువాత కర్నాటక రాజకీయాలు ఓ గాటున పడ్డట్టయ్యాయి. ఓట్ల లెక్కింపు తరువాత నుంచి ప్రారంభమైన హై డ్రామాలకు తెరపడింది. పీసీసీ చీఫ్ గా డీకే శివకుమార కొనసాగుతూనే డిప్యుటీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. 

- Advertisement -

సిద్ధూ, డేకే ఇద్దరూ రెండున్నరేళ్లపాటు కర్నాటక సీఎంలుగా కొనసాగనున్నారు. ఈనెల 20వ తేదీన కొత్త సర్కారు కొలువుదీరనుండగా ఇప్పటికే కేబినెట్ ను ఎంపిక చేసే ప్రక్రియను హైకమాండ్ పూర్తిచేసింది. అయితే ఈ తాజా నిర్ణయంతో డీకే శివకుమార్ పూర్తి సంతోషంగా లేరని, కేవలం పార్టీ కోసమే అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఈ మేరకు అంగీకరించినట్టు డీకే శివకుమార్ సోదరుడు వెల్లడించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News