Thursday, July 4, 2024
Homeనేషనల్Kavitha got fresh ED notices: రేపటి ఈడీ విచారణకు కవిత?

Kavitha got fresh ED notices: రేపటి ఈడీ విచారణకు కవిత?

కవితకు మళ్లీ ఈడీ నోటీసులు

కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితకు మళ్లీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీచేసింది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవితకు ఈడీ నోటీసులు జారీ చేసింది. కాగా గతంలోనే ఆమె ఈడీ విచారణకు హాజరయ్యారు. తాజాగా రేపే విచారణకు హాజరు కావాలంటూ ఈడీ సడన్ గా పేర్కొనటం విశేషం. మరి కవిత రేపు జరిగే విచారణకు హాజరవుతారా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఈడీ నోటీసులపై కవిత ఇప్పటికే సుప్రీంకోర్టును ఆశ్రయించగా ఆ కేసు విచారణ దశలోనే ఉంది. లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కవిత అంశం మరోసారి రాజకీయ రచ్చకు కేంద్రబిందువుగా తెలంగాణా రాజకీయాల్లో మారటం ఖాయంగా మారింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News