Saturday, November 15, 2025
Homeనేషనల్Dulquer Salmaan: లగ్జరీ కార్ల స్మగ్లింగ్‌ కేసులో బిగ్గెస్ట్ ట్విస్ట్‌.. దుల్కర్ సల్మాన్‌కు చెందిన రెండు...

Dulquer Salmaan: లగ్జరీ కార్ల స్మగ్లింగ్‌ కేసులో బిగ్గెస్ట్ ట్విస్ట్‌.. దుల్కర్ సల్మాన్‌కు చెందిన రెండు కార్లు సీజ్..!

Kerala Luxury Cars Case: కేరళ లగ్జరీ కార్ల స్మగ్లింగ్‌ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా మలయాళ నటులు దుల్కర్ సల్మాన్, పృథ్విరాజ్ సుకుమారన్ నివాసాలపై సోమవారం కస్టమ్స్ అధికారులు రెయిడ్స్‌ చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా అధికారులు ‘ఆపరేషన్‌ నమకూర్‌’ చేపట్టారు. ఈ సోదాలు కొచ్చి, తిరువనంతపురం, కోజికోడ్, మలప్పురం సహా పలు ప్రాంతాల్లో ఏకకాలంలో నిర్వహించారు. ఇప్పటి వరకు సీజ్ చేసిన 36 లగ్జరీ కార్లలో నటుడు దుల్కర్ సల్మాన్ కు చెందిన రెండు కార్లను కూడా గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. అయితే, పృథ్వీరాజ్‌కు చెందిన ఏ వాహనం కూడా స్వాధీనం చేసుకోలేదు. ఈ సెలబ్రిటీలు తెలిసో తెలియకో ఇలాంటి వాహనాలను కొనుగోలు చేసి ఉండవచ్చని, వారి వాంగ్మూలాలను నమోదు చేస్తామని, పత్రాలను పరిశీలిస్తామని కమిషనర్ వెల్లడించారు. టాక్స్‌ ఉల్లంఘనలకు పాల్పడి ఆయా కార్లను అక్రమంగా తీసుకొచ్చినట్లు తేలితే వాటిని సీజ్‌ చేస్తామన్నారు. యజమానులకు తెలిసినా, తెలియకపోయినా ఆయా వాహనాలను సీజ్ చేస్తామని వెల్లడించారు. ఒకవేళ యజమానులకు అక్రమం గురించి తెలిస్తే, వారిపై కూడా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. భూటన్ నుంచి అక్రమంగా వచ్చిన లగ్జరీ కార్లు కేరళలో సుమారు 150 నుంచి 200 వరకు ఉండవచ్చని, మిగిలిన వాటిని కూడా పట్టుకునే వరకు దాడులు కొనసాగుతాయని తిజు స్పష్టం చేశారు.

- Advertisement -

Also Read: https://teluguprabha.net/national-news/nia-investigation-on-gurpatwant-singh-pannun/

భూటన్ నుంచి అక్రమంగా కేరళకు..

భూటన్ నుంచి అక్రమ రవాణా చేసిన ఈ కార్లను పూర్తిగా విడదీసిన (CKD) స్థితిలో, కంటైనర్లలో దేశంలోకి తీసుకువచ్చారు. ఆ తర్వాత, మోసపూరితంగా ‘పరివాహన్’ వెబ్‌సైట్‌ను హ్యాక్ చేయడం లేదా లోపలి వ్యక్తులను ఉపయోగించడం ద్వారా పాత వాహనాలుగా, లేదా ఆర్మీ/ఎంబసీకి చెందినవిగా చూపి రిజిస్ట్రేషన్ వివరాలను తారుమారు చేశారు. 2014లో తయారైన కారును వెబ్‌సైట్‌లో 2005 నుంచే వినియోగంలో ఉన్నట్లు చూపించారని కస్టమ్స్ ప్రివెంటివ్ విభాగం అధికారుల విచారణలో తేలింది. ఈ స్మగ్లింగ్‌ ద్వారా కేవలం పన్ను ఎగవేత (ఐటీ, జీఎస్టీ) మాత్రమే కాకుండా, ఈ వాహనాలను బంగారం, మాదకద్రవ్యాల స్మగ్లింగ్‌కు కూడా ఉపయోగించినట్లు తమ దర్యాప్తులో తేలిందని కస్టమ్స్ కమిషనర్ తిజు వివరించారు. “కార్లను, బంగారాన్ని, మాదకద్రవ్యాలను ఈ విధంగా అక్రమంగా రవాణా చేయడం వల్ల జాతీయ, ఆర్థిక భద్రతకు పెద్ద ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది.” అని ఆయన తెలిపారు. అంతేకాకుండా, ఈ అక్రమాల ద్వారా వచ్చిన నిధులను ఉగ్రవాద కార్యకలాపాలకు ఉపయోగించారా? అనే కోణంలో కూడా దర్యాప్తు జరుగుతోందన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad