Wednesday, January 14, 2026
Homeనేషనల్POLITICAL FIRE: అమిత్ షాపై మమత 'బొగ్గు' బాంబు.. ఆధారాలు బయటపెడతారా?

POLITICAL FIRE: అమిత్ షాపై మమత ‘బొగ్గు’ బాంబు.. ఆధారాలు బయటపెడతారా?

Mamata Banerjee on ED raids : “మా పార్టీ ఎన్నికల వ్యూహాలను దొంగిలించడానికే బీజేపీ, ఈడీని ఓ రాజకీయ ఆయుధంగా వాడుకుంటోంది!” అంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అంతటితో ఆగకుండా, “బొగ్గు కుంభకోణంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సహా పలువురు బీజేపీ అగ్రనేతలకు వాటాలున్నాయి, కావాలంటే ఆధారాలు బయటపెడతా” అంటూ ఆమె చేసిన సంచలన ఆరోపణలు దేశ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అసలు ఈడీ దాడుల వెనుక ఉన్న కథేంటి..? మమత ఆరోపణల పర్యవసానాలేంటి..?

- Advertisement -

గురువారం నాడు, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు, తృణమూల్ కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్తగా పనిచేస్తున్న ఐ-ప్యాక్ (I-PAC) సంస్థకు సంబంధించిన ప్రాంగణాలపై దాడులు నిర్వహించారు. ఈ విషయం తెలియగానే, సీఎం మమతా బెనర్జీ స్వయంగా దాడి జరుగుతున్న ప్రదేశానికి వెళ్లడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.

ఈ ఘటన జరిగిన మరుసటి రోజైన శుక్రవారం,  మమతా బెనర్జీ కోల్‌కతాలో 10 కిలోమీటర్ల భారీ నిరసన పాదయాత్ర నిర్వహించి, అనంతరం జరిగిన బహిరంగ సభలో కేంద్రంపై నిప్పులు చెరిగారు.
బీజేపీపై ఎదురుదాడి.. సంచలన ఆరోపణలు ఈడీ దాడులను బీజేపీ రాజకీయ కుట్రగా అభివర్ణించిన మమత, తన ప్రసంగంలో నేరుగా బీజేపీ అగ్రనేతలనే లక్ష్యంగా చేసుకున్నారు.

బొగ్గు కుంభకోణంలో లబ్ధి పొందింది ఎవరో తెలుసా? కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సహా పలువురు బీజేపీ నేతలు! నా దగ్గర ఆధారాలున్నాయి. అవసరమైతే వాటిని ప్రజల ముందు ఉంచుతాను.”
– మమతా బెనర్జీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి

ఈడీ దాడుల ముఖ్య ఉద్దేశం, తమ పార్టీ అంతర్గత ఎన్నికల వ్యూహాలను తస్కరించడమేనని, అందుకే ముఖ్యమంత్రిగా కాకుండా, తృణమూల్ కాంగ్రెస్ ఛైర్‌పర్సన్‌గా పార్టీ సహచరులకు అండగా నిలబడటానికే తాను నిన్న అక్కడికి వెళ్లానని ఆమె స్పష్టం చేశారు. “నేను చేసింది సరైన పనే, అందులో ఎలాంటి తప్పూ లేదు,” అని ఆమె అన్నారు.

ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం : కేంద్ర దర్యాప్తు సంస్థలను అడ్డం పెట్టుకుని, బీజేపీయేతర ప్రభుత్వాలను, ప్రతిపక్ష నేతలను భయభ్రాంతులకు గురిచేయాలని కేంద్రం చూస్తోందని మమత ఆరోపించారు. అయితే, ఇలాంటి బెదిరింపులకు తాము భయపడబోమని, బీజేపీ నిరంకుశ వైఖరిపై తమ పోరాటం కొనసాగుతుందని ఆమె స్పష్టం చేశారు. మమతా బెనర్జీ చేసిన ఈ ప్రత్యక్ష, తీవ్రమైన ఆరోపణలతో, పశ్చిమ బెంగాల్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పోరు తారాస్థాయికి చేరింది. ఈ మాటల యుద్ధం రాబోయే రోజుల్లో ఎలాంటి రాజకీయ పరిణామాలకు దారితీస్తుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News