Sunday, November 16, 2025
Homeనేషనల్Manmohan Singh: ఇక సెలవు.. ముగిసిన మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు

Manmohan Singh: ఇక సెలవు.. ముగిసిన మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు

మాజీ ప్రధాని మ‌న్మోహ‌న్ సింగ్(Manmohan Singh) అంతిమ సంస్కారాలు అధికారక లాంఛనాలతో ఢిల్లీలోని నిగమ్‌బోధ్‌ ఘాట్‌లో నిర్వహించారు. కుటుంబసభ్యులు సిక్కు సంప్రదాయ పద్ధతిలో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ(Rahul Gandhi) ఆయన పాడె మోశారు.

- Advertisement -

ఈ అంత్యక్రియల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Droupadi Murmu), ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ (Jagadeep Dhankad), ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi), కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, జేపీ నడ్డా, భూటాన్ రాజు జిగ్మే వాంగ్‌చుక్, మారిషస్ విదేశాంగ మంత్రి ధనంజయ్ రాంఫుల్, త్రివిధ దళాధిపతులు హాజరయ్యారు.

ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge), రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ (Priyanka Gandhi), కర్ణాటక సీఎం సిద్ధరామయ్య (CM Siddharamaiah), తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)తో పాటు తదితర ముఖ్య నాయకులు హాజరయ్యారు. అంతకుముందు ఏఐసీసీ (AICC) ప్రధాన కార్యాలయం నుంచి అంతిమయాత్ర ప్రారంభం అయి నిగమ్‌బోధ్ ఘాట్ వరకు కొనసాగింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad