Saturday, November 15, 2025
Homeనేరాలు-ఘోరాలుTrain accident: మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం.. పలువురు మృతి

Train accident: మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం.. పలువురు మృతి

మహారాష్ట్ర(Maharashtra)లోని జల్గావ్‌లో ఘోర రైలు ప్రమాదం(Train accident) చోటుచేసుకుంది. పుష్పక్ రైలులో మంటలు వ్యాపిస్తున్నాయనే వదంతులతో చైన్ లాగిన ప్రయాణికులు కిందకి దిగి పక్కనున్న పట్టాలపైకి పరుగెత్తారు. అదే సమయంలో వచ్చిన కర్ణాటక ఎక్స్‌ప్రెస్ రైలు వారిపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో పలువురు మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. సమాచారం అందుకున్న అధికారులు సహాయ చర్యలు చేపడుతున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad