మావోయిస్టులకు వరుస షాక్లు తగులుతున్నాయి. మావోయిస్టుల ఏరివేతలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ చేపట్టిన సంగతి తెలిసిందే. ఇటీవల భద్రతా బలగా కాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు సహా 30 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో కొందరు మావోయిస్టు అగ్ర నేతలు తాము లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నామని పోలీసులకు సమాచారం అందిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు తాజాగా ఒడిశాలోని కోరాపూట్లో హిడ్మాను అరెస్ట్ చేయడం హాట్ టాపిక్గా మారింది.
మావోయిస్టు వర్గాల్లో హిడ్మాగా పేరుపొందిన కుంజుమ్ హిడ్మా అలియాస్ మోహన్ ఒడిశా, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వోయిస్టు కార్యకలాపాలు చురుగ్గా నిర్వహించడంలో కీలక పాత్రధారి. అతడి వద్ద నుంచి ఓ AK-47 రైఫిల్, 35 రౌండ్ల మందుగుండు సామగ్రి, 117 డిటోనేటర్లు, గన్పౌడర్, రేడియోలు, కత్తులు,మావోయిస్టు సాహిత్యం సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. హిడ్మా అరెస్టుతో మావోయిస్టు కార్యకలపాలకు చెక్ పడినట్లే అని భద్రతా బలగాలు భావిస్తున్నాయి.