Monday, March 31, 2025
Homeనేషనల్Encounter: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. 20 మంది మావోయిస్టులు మృతి

Encounter: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. 20 మంది మావోయిస్టులు మృతి

ఛత్తీస్‌గఢ్(Chhattisgarh)అటవీ ప్రాంతం మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. సుక్మా జిల్లాలోని కేరళపాల్ ప్రాంతంలో భారీ ఎన్‌కౌంటర్(Encounter) జరిగింది. స్థానిక గోగుండా కొండపై మావోయిస్టుల కదలికలు ఉన్నాయన్న సమాచారంతో పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో 20మంది మావోయిస్టులు మృతిచెందారు. ఇద్దరు జవాన్లకు స్వల్ప గాయాలయ్యాయి.

- Advertisement -

ఈ ఆపరేషన్‌లో డిస్ట్రిక్ట్‌ రిజర్వ్‌గార్డ్‌, సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ (CRPF) బలగాలు పాల్గొన్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. మావోయిస్టుల మృతదేహాలతో పాటు భారీ ఆయుధ సామాగ్రి భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఎన్‌కౌంటర్‌కు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News