Mathura Crime News : ఉత్తరప్రదేశ్లోని మధుర జిల్లాలో అత్యంత విషాదకరమైన సంఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సభ్యులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా పెను కలకలం రేపింది. మహావన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖాపర్పూర్ గ్రామంలో జరిగిన ఈ ఘటనతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
Priyanka Mohan : ప్రకృతి ఒడిలో మెరిసిపోతున్న ‘నాని గ్యాంగ్ లీడర్’ బ్యూటీ..!
ఒకే కుటుంబంలో ఐదుగురు బలి.. అసలేం జరిగింది?
ఖాపర్పూర్ గ్రామానికి చెందిన మనీష్ (35) అనే రైతు తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. మనీష్తో పాటు అతని భార్య సీమ (32), వారి ముగ్గురు చిన్న పిల్లలైన హానీ (5), ప్రియాంషి (4), పంకజ్ (2) శవాలుగా పడి ఉండటం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. మంగళవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో వారు విగతజీవులుగా పడి ఉన్న విషయాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పరిశీలించి, అవి స్వాధీనం చేసుకున్నారు.
విషం కలిపిన పాలు.. గోడపై సూసైడ్ నోట్
పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం, ఈ కుటుంబం రాత్రిపూట పాలల్లో విషం కలుపుకుని తాగి సామూహిక ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. వారు నివసించే గదిలో పాల గ్లాసులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఆ ఇంటి గోడపై “నేను నా సొంత ఇష్టానుసారంగా ఆత్మహత్య చేసుకుంటున్నాను” అని రాసి ఉంది. ఈ రాతను బట్టి ఇది ఆత్మహత్యేనని పోలీసులు భావిస్తున్నప్పటికీ, ఒక నిండు సంసారం ఇలా అర్ధాంతరంగా ముగిసిపోవడానికి దారితీసిన కారణాలు మాత్రం ఇంకా అస్పష్టంగానే ఉన్నాయి.
కుటుంబ నేపథ్యం , పోలీసుల దర్యాప్తు
మనీష్ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి ఇద్దరు సోదరులు ఉండగా, వారు మనీష్ ఇంటి పక్కనే విడివిడిగా నివాసం ఉంటున్నారు. ఇటీవలే మనీష్ తండ్రి కూడా మరణించినట్లు సమాచారం. తండ్రి మరణం తర్వాత కుటుంబంలో ఏవైనా ఆర్థిక సమస్యలు లేదా మనస్పర్థలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు. స్థానికుల నుంచి, మనీష్ సోదరుల నుంచి సమాచారం సేకరిస్తున్నామని, పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. అప్పటివరకు సంతోషంగా ఉన్న కుటుంబం ఇలా విగతజీవులుగా పడి ఉండటంతో గ్రామంలో విషాదం నెలకొంది.
Tamannaah: నో రెమ్యూనరేషన్ – ఫ్రీగా బాలీవుడ్ సినిమాలో నటించిన తమన్నా

