Sunday, September 22, 2024
Homeనేషనల్Bihar: కిలాడీ దొంగలు.. ఏకంగా పట్టపగలే మొబైల్ టవర్ నే ఎత్తుకెళ్లారు!

Bihar: కిలాడీ దొంగలు.. ఏకంగా పట్టపగలే మొబైల్ టవర్ నే ఎత్తుకెళ్లారు!

Bihar: దొంగలకు దొంగలు.. కిలాడీ దొంగలు బీహార్ లో ఉన్నారు. బీహార్ లో చోరీలు ఎక్కువ. దొంగతనంలో ఆరితేరిన వాళ్ళు ఉన్నారిక్కడ. అయితే.. పర్సులు.. ఫోన్లు.. ఇళ్లలో చోరీలు.. మహా అయితే.. ఏటీఎంను ఎత్తికెళ్లిన దొంగలను చూసి ఉంటాం ఇప్పటి వరకు. కానీ, ఏకంగా మొబైల్ టవర్ ను ఎత్తుకెళ్లారు కిలాడీ దొంగలు. బిహార్లో ఓ దొంగల ముఠా పట్టపగలే సెల్ ఫోన్ టవర్ను చోరీ చేసింది. మొబైల్ సర్వీస్ ప్రొవైడర్ అధికారులుగా నటించిన ముఠా పట్టపగలే సెల్ టవర్ను దొంగిలించింది.

- Advertisement -

అప్పటికీ టవర్ ఉన్న ప్రాంతం యజమానిని అనుమానం వచ్చి దొంగల్ని పలుమార్లు ప్రశ్నించినా.. కంపెనీ నష్టాల్లో ఉందని అందుకే టవర్ తీసివేస్తున్నట్లు.. స్థల యజమానిని నమ్మించారు. చివరికి కంపెనీ వాళ్ళు ఈ ప్రాంతానికి రావడంతో టవర్ తీసుకెళ్లింది దొంగలని తేలింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పట్నా గార్డెన్బాగ్లోని కచ్చి తలాబ్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సెల్ టవర్ కు కొన్ని నెలలుగా ఆ కంపెనీ వారు అద్దె చెల్లించడం లేదు.

ఈ విషయం తెలుసుకున్న 10-15 మందితో కూడిన ఓ దొంగల ముఠా టవర్ను దొంగలించడానికి ప్లాన్ చేసింది. పక్కా ప్లాన్ తో ఆ టవర్ ఏర్పాటు చేసిన స్థలం యజమానితో.. తాము సర్వీస్ ప్రొవైడర్ అధికారులమని.. కంపెనీ నష్టాల్లో ఉన్నందున అద్దె చెల్లించలేమని చెప్పారు. అందుకే టవర్ను తొలగించాలనుకుంటున్నట్లు చెప్పగా దానికి భూమి యజమాని అంగీకరించాడు. దీంతో ఆ ముఠా వెంటనే టవర్ను నేలమట్టం చేసింది. అనంతరం టవర్ భాగాలను అక్కడ నుంచి ఎత్తుకెళ్లింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News