Saturday, November 15, 2025
Homeనేషనల్MODI: ట్రంప్, పుతిన్ భేటీ వేళ.. జెలెన్స్కీకి మోదీ కీలక ఫోన్ కాల్

MODI: ట్రంప్, పుతిన్ భేటీ వేళ.. జెలెన్స్కీకి మోదీ కీలక ఫోన్ కాల్

PM Modi: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్‌స్కీతో సోమవారం ఫోన్‌ ద్వారా సంభాషించారు. తాజా పరిణామాల నేపథ్యంలో వీరి మధ్య జరిగిన ఈ చర్చకు అంతర్జాతీయంగా ప్రాధాన్యత ఏర్పడింది. ఇరు నేతలు సోషల్ మీడియా వేదికగా ఈ అంశాన్ని వెల్లడించారు.

- Advertisement -

శాంతియుత పరిష్కారానికి భారత్‌ మద్దతు: మోదీ స్పష్టం

ఫోన్ సంభాషణ అనంతరం ప్రధాని మోదీ తన అధికారిక ట్వీట్‌లో మాట్లాడుతూ, “ఉక్రెయిన్‌లో నెలకొన్న పరిస్థులను పరిగణలోకి తీసుకొని, అధ్యక్షుడు జెలెన్‌స్కీ అభిప్రాయాలను తెలుసుకున్నాను. ఈ సంక్షోభానికి శాంతియుత పరిష్కార మార్గం కోరుకుంటున్నాం. భారత్‌ ఎప్పటికీ మానవతా విలువలకు, శాంతికి అంకితంగా ఉంటుందనే విషయాన్ని స్పష్టం చేశాను. ద్వైపాక్షిక సంబంధాల బలానికి భారత్‌ కట్టుబడి ఉంది,” అని పేర్కొన్నారు.

జెలెన్‌స్కీ స్పందన: భారత్‌ మద్దతు అభినందనీయం

జెలెన్‌స్కీ కూడా తన ట్వీట్‌లో ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. “రష్యా దాడులు మా పట్టణాలు, గ్రామాలను లక్ష్యంగా చేసుకుంటున్నాయన్న విషయం ప్రధానికి వివరించాను. ఉక్రెయిన్ శాంతి ప్రయత్నాల విషయంలో మోదీ మద్దతుగా ఉండటం ఆనందదాయకం. అంతేకాక, యుద్ధం ముగింపులో భారత భాగస్వామ్యం కీలకమని భావిస్తున్నాం” అని జెలెన్‌స్కీ వ్యాఖ్యానించారు.

పుతిన్‌తో మోదీ, ట్రంప్‌ సమావేశానికి ముందు కీలక పరిణామం

ఇటీవలే ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో కూడా చర్చలు జరిపారు. ఈ సంక్షోభానికి మానవీయత, సంయమనం ద్వారా శాంతియుత పరిష్కారమే మార్గమని ఆయన స్పష్టం చేశారు. రష్యా నుంచి భారత చమురు దిగుమతులపై ఉన్న అంతర్జాతీయ దృష్టితో పాటు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌-పుతిన్ మధ్య త్వరలో జరిగే భేటీకి ముందు మోదీ–జెలెన్‌స్కీ సంభాషణ ప్రాధాన్యత సంతరించుకుంది.

భారత్‌ తటస్థంగా కానీ శాంతికి నిలబడే వైఖరి

ప్రస్తుత అంతర్జాతీయ దశల్లో, శాంతికి తోడ్పడే విధంగా భారత్‌ తన వైఖరిని స్పష్టంగా వెల్లడిస్తోంది. యుద్ధంలో చిక్కుకున్న ప్రజలకు మానవీయ మద్దతు అవసరం అని భావిస్తూ, భారత ప్రభుత్వం అవసరమైన స్థాయిలో సహకారం అందించడానికి సిద్ధంగా ఉందని మోదీ పునరుద్ఘాటించారు.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad