Saturday, November 15, 2025
Homeనేషనల్Mumbai On High Alert : మానవ బాంబుల ముప్పు... 'నిమజ్జనం వేళ కోటి మందిని...

Mumbai On High Alert : మానవ బాంబుల ముప్పు… ‘నిమజ్జనం వేళ కోటి మందిని చంపుతాం’

Mumbai terror threat during Ganesh festival :  గణనాథుని నిమజ్జన శోభతో కళకళలాడాల్సిన ముంబయి మహానగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. లక్షలాది భక్తులు వీధుల్లోకి వచ్చి భక్తి పారవశ్యంలో మునిగితేలే వేళ, ఉగ్రవాదుల నుంచి అందిన ఓ బెదిరింపు ఈ-మెయిల్ నగరాన్ని వణికిస్తోంది. “కోటి మందిని చంపుతాం.. నగరాన్ని రక్తంతో ముంచెత్తుతాం..” అంటూ వచ్చిన ఆ సందేశంతో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. అసలు ఈ బెదిరింపు ఎక్కడి నుంచి వచ్చింది..? పోలీసుల దర్యాప్తులో ఏం తేలింది..? నగరం ఇప్పుడు ఎలా బిక్కుబిక్కుమంటోంది..?

- Advertisement -

నిఘా వర్గాలను కకావికలం చేసిన ఈ-మెయిల్ : వినాయక నిమజ్జనానికి నగరం సిద్ధమవుతున్న తరుణంలో, ముంబయి ట్రాఫిక్ కంట్రోల్ రూమ్‌కు ‘లష్కర్-ఏ-జిహాదీ’ అనే వాట్సాప్ ఖాతా నుంచి ఓ ఈ-మెయిల్ అందింది. పాకిస్థాన్‌కు చెందిన జిహాదీ గ్రూప్ సభ్యుడినని చెప్పుకున్న ఆ ఆగంతకుడు, అందులో పేర్కొన్న వివరాలు వెన్నులో వణుకు పుట్టించేలా ఉన్నాయి.

14 మంది ఉగ్రవాదులు: నగరం నలుమూలలా 14 మంది ఉగ్రవాదులు చొరబడ్డారని సందేశంలో ఉంది.

34 వాహనాల్లో బాంబులు: వేర్వేరు ప్రాంతాల్లో 34 వాహనాల్లో మానవ బాంబులు సిద్ధంగా ఉన్నాయని హెచ్చరించారు.

400 కిలోల ఆర్డీఎక్స్: 400 కిలోల ఆర్డీఎక్స్‌తో నగరాన్ని పేల్చివేసి, కోటి మందిని చంపుతామని ఆ దుండగులు బెదిరించారు.

అప్రమత్తమైన యంత్రాంగం.. వీధివీధినా జల్లెడ : ఈ-మెయిల్ అందిన వెంటనే ముంబయి పోలీసు యంత్రాంగం హై అలర్ట్ ప్రకటించింది. పండుగ భద్రతను తక్షణమే సమీక్షించి, నగరాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంది.

భారీ భద్రత: బాంబు నిర్వీర్య బృందాలు, డాగ్ స్క్వాడ్‌లతో రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు, మార్కెట్లు, నిమజ్జనం జరిగే కీలక ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు.

21,000 మంది పోలీసులు: నిమజ్జన దినమైన శనివారం నాడు, ఏవిధమైన అవాంఛనీయ సంఘటనలు సంభవించకుండా నిరోధించేందుకు, 21,000 కంటే అధిక సంఖ్యలో పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేయనున్నారు. వీరిలో 40 మంది డీసీపీలు, 3000 మంది అధికారులు ఉన్నారు.

ఏఐ టెక్నాలజీ: తొలిసారిగా, ట్రాఫిక్, జన సమూహాన్ని నియంత్రించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీని కూడా వినియోగిస్తున్నారు. ఇప్పటివరకు జరిపిన తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలూ లభించలేదని, ప్రజలు ఎలాంటి వదంతులను నమ్మవద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని కోరారు.

గతంలోనూ బెదిరింపులు : ముంబయికి బాంబు బెదిరింపులు రావడం కొత్తేమీ కాదు. ఇటీవల థానే రైల్వే స్టేషన్‌ను, ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని పేల్చేస్తామంటూ బెదిరింపులు వచ్చినా, అవన్నీ బూటకమని తేలాయి. అయితే, గణేశ్ నిమజ్జనం వంటి అత్యంత సున్నితమైన సమయంలో వచ్చిన ఈ హెచ్చరికను మాత్రం పోలీసులు తీవ్రంగా పరిగణిస్తూ.. నగరంపై డేగ కన్నుతో నిఘా పెట్టారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad