Thursday, September 19, 2024
Homeనేషనల్Mumbai: ప్రధానిగా కాదు ఫ్యామిలీ మెంబర్ గా ..బోహ్రా కమ్యూనిటీలో మోడీ

Mumbai: ప్రధానిగా కాదు ఫ్యామిలీ మెంబర్ గా ..బోహ్రా కమ్యూనిటీలో మోడీ

దావూదీ బోహ్రా తెగవారి కొత్త క్యాంపస్ ను యూనివర్సిటీలో ప్రారంభించారు నరేంద్ర మోడీ. ముంబైలో అత్యంత ప్రభావ వంతమైన ముస్లిం తెగగా వీరికి పేరుంది. త్వరలో జరుగనున్న ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో ఈ వర్గాన్ని గత కొంతకాలంగా బీజేపీ దువ్వుతోంది. ఈ సందర్భంగా బోహ్రా కమ్యూనిటీ పెద్ద సైద్నా ముఫద్దాల్ సైఫుద్దీన్ చేతిలో చేయి వేసి, మోడీ నడిచారు.

- Advertisement -

సైద్నా సాహెబ్ కుటుంబంలోని నాలుగు తరాలు తనకు తెలుసునంటూ వారి కుటుంబ సభ్యుల్లో తాను ఒకడినంటూ మోడీ పేర్కొనటం విశేషం.

బృహన్ ముంబై ఎన్నికల నేపథ్యంలో మోడీ తరచూ ఢిల్లీ నుంచి ముంబై షటిల్ చేస్తున్నారు. దేశంలోనే అత్యంత ధనవంతమైన స్థానిక సంస్థగా ఉన్న బీఎంసీ ఎన్నికలను బీజేపీ, శివసేన అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News