Saturday, November 15, 2025
Homeనేషనల్Modi: మోదీ డిగ్రీ వివాదం.. సీఐసీ ఆదేశాలపై హైకోర్టు స్టే

Modi: మోదీ డిగ్రీ వివాదం.. సీఐసీ ఆదేశాలపై హైకోర్టు స్టే

PM Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విద్యార్హతలకు సంబంధించిన వివాదంపై ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఆయన బ్యాచిలర్ డిగ్రీ (BA) వివరాలను వెల్లడించాలంటూ ఢిల్లీ యూనివర్సిటీని (డీయూ) ఆదేశిస్తూ కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) జారీ చేసిన ఉత్తర్వులను కోర్టు పక్కన పెట్టేసింది. ఈ మేరకు ఫిబ్రవరి 27న రిజర్వ్ తీర్పును జస్టిస్ సచిన్ దత్తా సోమవారం వెలువరించారు. విచారణ సందర్భంగా ఢిల్లీ యూనివర్సిటీ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. విద్యార్థుల రికార్డులను విశ్వాసంతో భద్రపరిచే బాధ్యత తమపై ఉందని, వాటిని గోప్యంగా ఉంచాల్సి ఉంటుందని కోర్టుకు తెలిపారు. కేవలం తెలుసుకోవాలన్న ఉత్సుకత కోసం, విస్తృత ప్రజా ప్రయోజనం లేనప్పుడు ఆర్టీఐ చట్టం కింద ఆ సమాచారాన్ని బహిర్గతం చేయలేమని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ 1978లో బీఏ డిగ్రీ పొందినట్లు తమ వద్ద రికార్డులు ఉన్నాయని, వాటిని కోర్టుకు చూపడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని కూడా పేర్కొన్నారు.

- Advertisement -

Read Also: GST: జీఎస్టీ స్లాబులపై గుడ్ న్యూస్.. సెప్టెంబర్ 22 నుంచే అమలు..!

విస్తృత ప్రజా ప్రయోజనం

మరోవైపు, ఆర్టీఐ దరఖాస్తుదారు తరఫు న్యాయవాది… ప్రధాని విద్యా వివరాలు తెలుసుకోవడంలో విస్తృత ప్రజా ప్రయోజనం ఉందని వాదించారు. అయితే, ఈ వాదనను తోసిపుచ్చిన హైకోర్టు, ఢిల్లీ యూనివర్సిటీ వాదనకే మొగ్గుచూపి సీఐసీ ఆదేశాలను రద్దు చేసింది. ఈ తీర్పుతో మోదీ విద్యార్హతలకు సంబంధించిన వివాదానికి తెరపడినట్లయింది. కాగా.. 1978లో బీఏ ఉత్తీర్ణులైన విద్యార్థుల రికార్డులను పరిశీలించేందుకు అనుమతించాలంటూ నీరజ్ అనే వ్యక్తి చేసిన ఆర్టీఐ దరఖాస్తు మేరకు సీఐసీ 2016లో ఈ ఆదేశాలు ఇచ్చింది. అయితే, ఈ ఉత్తర్వులపై హైకోర్టు 2017లోనే స్టే విధించింది. అయితే, మోదీ బ్యాచిలర్ డిగ్రీ (BA) వివరాలను వెల్లడించాలంటూ ఢిల్లీ యూనివర్సిటీని (డీయూ) ఆదేశిస్తూ మరోసారి సీఐసీ ఉత్తర్వులు జారీ చేసింది. సీఐసీ ఆదేశాలను సవాలు చేస్తూ ఢిల్లీ యూనివర్సిటీ గతంలో హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ పూర్తిచేసిన న్యాయస్థానం, ఢిల్లీ యూనివర్సిటీ వాదనలతో ఏకీభవించింది.
Read Also: Stock market: రాణించిన ఐటీ షేర్లు.. లాభాల్లో స్టాక్ మార్కెట్లు..!

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad